Viral Pic : ప్రపంచం మొత్తం టెక్నాలజీ దిశగా పరుగులు పెడుతోంది. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియాలో ప్రతి విషయం క్షణాల్లో వైరల్ అయిపోతోంది. సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఎంతగానో దగ్గరవుతున్నారు. సెలబ్రిటీలు పోస్ట్ చేసే చిన్ననాటి జ్ఞాపకాలు కూడా క్షణాల వ్యవధిలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఒక హీరోయిన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన తన చిన్ననాటి ఫోటో అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఎవరు ఈ క్యూట్ బేబీ అంటూ వెతుకులాట మొదలైంది. ఈ ఫోటోలలో ఉన్న ముద్దులొలికే ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్. ఇప్పుడు ఆ హీరోయిన్ కి సంబంధించిన చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్కూల్ డ్రెస్ లో క్యూట్ స్మైల్ తో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఫిదా సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన నటనతో అందరిని ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాలో హీరో వరుణ్ కు జోడిగా నటించి హైబ్రిడ్ పిల్ల ఒక్కటే పీస్ అంటూ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. మొదటి చిత్రంతోనే తన నటనతో, డాన్స్ తో కుర్రకారును తన మాయలో పడేసింది సాయి పల్లవి.
టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్స్ గా పరిచయమైనా కొత్త కొత్త అవకాశాలని అందిపుచ్చుకోవడం కోసం ఎక్స్పోజింగ్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు. అటు సినిమాలలోనూ, ఇటు యాడ్స్ లోనూ నటిస్తూ కోట్ల రూపాయలను ఖాతాలో వేసుకుంటున్నారు. కానీ వీటన్నింటికి భిన్నంగా చిత్రంలో చేసే క్యారెక్టర్ కు మాత్రమే ప్రత్యేక గుర్తింపు ఉండాలని భావిస్తూ ముందుకు దూసుకుపోతోంది లేడీస్ పవర్ స్టార్ సాయి పల్లవి. విరాటపర్వం, గార్గి వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తమిళ, తెలుగు, మలయాళ చిత్రాల్లో తన సహజసిద్ధమైన నటనతో ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…