Gongura Pachi Royyala Kura : ఆదివారం వస్తుందంటే చాలు.. ఈసారి ఏ మాంసాహారం తినాలా.. అని నాన్వెజ్ ప్రియులు ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలో ఎవరి అభిరుచులు, స్థోమతకు తగినట్లు వారు నాన్వెజ్ ఫుడ్ను తెచ్చి వండుకుని తింటుంటారు. అయితే నాన్వెజ్ ఆహారాల్లో పచ్చి రొయ్యలు చెప్పుకోదగినవి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. సముద్రపు ఆహారం జాబితాకు చెందే ఇవి మనకు ఎన్నో పోషకాలను అందిస్తాయి. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే పచ్చి రొయ్యలను గోంగూరతో కలిపి వండుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టపడతారు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర పచ్చి రొయ్యల కూరను తయారు చేసేందుకు కావల్సిన పదార్థాలు..
పచ్చి రొయ్యలు – ఒక కిలో, గోంగూర – మూడు కట్టలు, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, వెల్లుల్లి – 5 రెబ్బలు, ఆవాలు, జీలకర్ర – అర టీస్పూన్ చొప్పున, సన్నగా తరిగిన ఉల్లిపాయలు – రెండు, చీల్చిన పచ్చి మిర్చి – రెండు, పసుపు – అర టీస్పూన్.
గోంగూర పచ్చి రొయ్యల కూరను తయారు చేసే విధానం..
పచ్చి రొయ్యలు, గోంగూరను బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. స్టవ్ మీద వెడల్పాటి పాత్ర పెట్టి అది వేడెక్కాక దాంట్లో గోంగూర వేసి ఉడికించాలి. దీంట్లోనే కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు గిన్నెను కిందకు దించి పప్పు గుత్తితో గోంగూరను మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడి చేసి వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత పచ్చి రొయ్యలు వేసి కాసేపు వేయించాలి. తరువాత దీంట్లో పసుపు, ఉప్పు, కారం వేసి ఉడికించాలి. ప్రత్యేకంగా నీళ్లు పోయాల్సిన పనిలేదు. రొయ్యల్లో ఉండే నీటితోనే కూర ఉడుకుతుంది. కూర ఉడికి దగ్గరకు రాగానే గోంగూర ముద్దను వేసి బాగా కలపాలి. తరువాత మూత పెట్టి తక్కువ మంటపై కాసేపు ఉడికించి దించేయాలి. దీంతో గోంగూర పచ్చి రొయ్యల కూర రెడీ అవుతుంది. దీన్ని అన్నంతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. రొయ్యలను రొటీన్గా కాకుండా ఇలా చేసుకుంటే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…