Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్గా నిలిచిన చిత్రం.. ఆచార్య. వాస్తవానికి చిరంజీవి ఈ మూవీపై ఎన్నో ఆశలను పెట్టుకున్నారు. కానీ ఆయన నమ్మకం వమ్ము అయింది. ఆచార్య భారీ విజయం సాధిస్తుందని చిరంజీవి అనుకున్నారట. అయితే అందుకు భిన్నంగా భారీ డిజాస్టర్ అయింది. ఈ క్రమంలోనే చిరంజీవి తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే తన భవిష్యత్తు సినిమాలు ఇలా డిజాస్టర్లుగా మారకుండా ఉండేందుకు గాను చిరంజీవి పేరు మార్చుకున్నారని.. గత రెండు, మూడు రోజులుగా వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దానికి బలం చేకూర్చేలా గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్లోనూ చిరంజీవి ఇంగ్లిష్ పేరు మారి కనిపించింది. దీంతో ఆయన నిజంగానే పేరు మార్చుకుని ఉంటారని చాలా మంది నమ్మారు.
వాస్తవానికి ఆచార్య మాత్రమే కాదు.. గతంలో చిరంజీవి కెరీర్లో ఇంకా ఎన్నో భారీ ఫ్లాప్స్ వచ్చాయి. అయినప్పటికీ ఆయన పేరు మార్చుకోలేదు. కానీ గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు టీజర్లో Chiranjeevi అని రెగ్యులర్గా కనిపించేలా వేయకుండా Chiranjeeevi అని మూడు ఆంగ్ల e అక్షరాలు వచ్చేలా పేరు వేశారు. దీంతో చిరంజీవి పేరు మార్చుకున్నారేమోనని అందరూ అనుకున్నారు. దీనిపై అనేక కథనాలు వచ్చాయి. అయితే దీనిపై గాడ్ ఫాదర్ చిత్ర యూనిట్ స్పందించింది. చిరంజీవి పేరు మార్చుకోలేదని క్లారిటీ ఇచ్చేసింది.
చిరంజీవి ఎలాంటి పేరు మార్చుకోలేదని.. అది చూడకుండా జరిగిన మిస్టేక్ అని గాడ్ ఫాదర్ టీమ్ స్పష్టం చేసింది. అయితే అంత భారీ చిత్రానికి సంబంధించి ఏదైనా అప్డేట్ ను రిలీజ్ చేసేటప్పుడు ఇంతటి బ్లండర్ మిస్టేక్ను ఎలా చేస్తారు.. అని మళ్లీ ట్రోలింగ్ మొదలైంది. మేకర్స్ను ఈ విషయంలో చిరు ఫ్యాన్స్ భారీగానే ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా చిరంజీవి పేరు మార్పు అన్న వార్త మాత్రం సంచలనం సృష్టించింది. అయితే ఎట్టకేలకు గాడ్ ఫాదర్ టీమ్ స్పష్టం చేయడంతో ఇక ఈ విషయంపై చర్చకు ఫుల్స్టాప్ పడినట్లే అయింది.
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…