Viral Video : ప్రస్తుత తరుణంలో మహిళలు సమాజంలో వివక్షను, వేధింపులను ఎదుర్కొంటున్నారు. ప్రతి సెకనుకు ప్రపంచంలో ఏదో ఒక చోట మహిళలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. పనిచేసే చోట, బహిరంగ ప్రదేశాల్లో, ఇళ్లలోనూ కామాంధులు మహిళలను విడిచిపెట్టడం లేదు. చిన్నారులను సైతం చెరబడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతి దేశంలోనూ మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అయితే కొందరు మహిళలు మాత్రం తమను వేధించే వారికి చాలా గట్టిగా బుద్ధి చెబుతున్నారు. అక్కడ కూడా అలాగే జరిగింది. ఓ యువతి తనను వేధిస్తున్న కొందరు యువకులకు దీటుగా సమాధానం చెప్పింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఓ యువతి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. 6 మంది యువకులు ఆమెను వేధించడం మొదలు పెట్టారు. ఆమె చుట్టూ వారు చేరి ఆమెను వేధించసాగారు. అయితే ఉన్నట్లుంగా ఆ యువతి సివంగిగా రెచ్చిపోయింది. తన చుట్టూ ఉన్న యువకులను ఒక్కసారే తన్నింది. దీంతో అందరూ చెల్లా చెదురు అయ్యారు. తరువాత ఒక్కో యువకున్ని పట్టుకుని గాల్లోకి ఎగిరి మరీ వాళ్లను తన్నింది. వాళ్లకు కరాటే పంచ్లు ఇచ్చింది. దీంతో ఆ యువకులు అక్కడి నుంచి దెబ్బకు పరారయ్యారు. అలా ఆ యువతి తనను వేధిస్తున్న యువకులకు గట్టిగా బుద్ధి చెప్పింది.
అయితే అదే సమయంలో అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఈ సంఘటన తాలూకు దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది ఆ వీడియోను చూసి కామెంట్లు పెడుతున్నారు. ఆ యువతి ధైర్యానికి ఆమెను ప్రశంసిస్తున్నారు. అలాంటి వారికి అలాగే బుద్ధి చెప్పాలని ఆమెను అభినందిస్తున్నారు. ఇక ఈ వీడియోకు ఇప్పటికే 35 లక్షలకు పైగా వ్యూస్ రాగా.. 9వేలకు పైగా ఈ వీడియోను షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…