Rashmika Mandanna : నేషనల్ క్రష్గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్లతో ఎంతో బిజీగా ఉంది. పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్గా మారిన రష్మిక మందన్న ప్రస్తుతం 4 బాలీవుడ్ సినిమాల్లో వరుసగా నటిస్తూనే ఉంది. అందుకు గాను ఈమె ముంబైలో ఏకంగా ఓ ఇంటినే కొనుగోలు చేసింది. ఇక రష్మిక మందన్న ఎక్కడ కనిపించినా నవ్వుతూ చాలా సరదాగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా ఓ మూవీ షూటింగ్లో పాల్గొనగా.. అభిమానులు ఫొటోల కోసం ఎగబడ్డారు. అయినప్పటికీ ఎంతో ఓపిగ్గా ఆమె వారితో ఫొటోలు దిగింది.
అయితే రష్మిక మందన్న తన ఫ్యాన్స్తో ఫొటోలు దిగిన అనంతరం తన కారవాన్లోకి వెళ్తుండగా.. ఓ అభిమాని వచ్చి ఫొటో కావాలని అడిగాడు. అయితే పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు అతన్ని వెనక్కి పంపించేయబోయాడు. కానీ రష్మిక అతన్ని వారిస్తూ ఎంతో ఓపిగ్గా తన అభిమానితో కలసి ఫొటో దిగింది. కాగా ఆ సమయంలో తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ క్రమంలోనే రష్మిక మందన్న తన ఫ్యాన్స్పై చూపిస్తున్న ఆప్యాయతకు ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆమెకు ఓపికకు సహనానికి ఆమెను అభినందిస్తున్నారు. ఫ్యాన్స్తో స్టార్స్ ఇలాగే ఉండాలి.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
కాగా రష్మిక మందన్న ప్రస్తుతం మిషన్ మజ్ను, గుడ్ బై అనే హిందీ సినిమాలతోపాటు సీతా రామమ్ అనే తెలుగు సినిమా షూటింగ్ను పూర్తి చేసుకుంది. అలాగే తమిళంలో ఈమె విజయ్ పక్కన నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇక త్వరలోనే పుష్ప 2 తోపాటు హిందీలో యానిమల్ అనే మరో మూవీలోనూ ఈమె నటించనుంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…