గుజరాత్ వల్సద్ రైల్వే స్టేషన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రైల్వే సిబ్బంది పోలీసులు ఉన్నఫలంగా ఆగి ఉన్న గుజరాత్ క్వీన్ ఎక్స్ప్రెస్ రైలులోకి పరుగులు తీస్తూ వెళ్లారు. అయితే ఆగి ఉన్న రైలులో ఒక యువతి మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు భావించిన అధికారులు వెంటనే ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
కానీ ఆ యువతి డైరీ చదివిన పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. ఆ డైరీ చదివిన అనంతరం పోలీసులు ఆమె ఆత్మహత్య చేసుకుందని నిర్ధారణకు వచ్చారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏమిటి ? అనే విషయం గురించి తెలియాలంటే పోస్టుమార్టం రిపోర్ట్స్ వచ్చేవరకు చూడాలని తెలిపారు. ఇక ఆ యువతి డైరీలో ఏం రాసింది అనే విషయానికి వస్తే..
సౌత్ గుజరాత్ కు చెందిన ఆ యువతి వడోదరలోని ఒక హాస్టల్లో ఉంటూ ఓ ఎన్జీవో సంస్థలో పనిచేస్తోంది. తన డైరీలో రాసిన ప్రకారం.. ఈనెల 4వ తేదీన ఇద్దరు యువకులు ఆమెను కిడ్నాప్ చేసి కళ్ళకు గంతలు కట్టి ఆపై కాళ్లు, చేతులు కట్టేసి ఆటోలో ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకు వెళ్ళారు.
అయితే ఇది గమనించిన ఒక బస్సు డ్రైవర్ వారిని వెంబడించి వారి దగ్గరకు వెళ్ళాడు. అతనిని గమనించిన ఆ ఇద్దరు యువకులు భయంతో అక్కడినుంచి పారిపోయారు. ఆ బస్సు డ్రైవర్ సహాయంతో ఆమె తిరిగి ఎంతో సురక్షితంగా తన స్నేహితుల దగ్గరకు చేరుకుంది.
అయితే అలా ఆమెను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకు వెళ్లిన తర్వాత ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆ అవమానాన్ని భరించలేకే ఆ యువతి ఇలా ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో అసలు విషయం తెలియాలంటే పోస్టుమార్టం రిపోర్ట్స్ వచ్చే వరకు వేచి చూడాలని తెలిపారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…