రైలులో ఆత్మహత్య చేసుకున్న యువతి.. డైరీ చూసి షాకైన పోలీసులు..!

November 17, 2021 9:10 AM

గుజరాత్ వల్సద్ రైల్వే స్టేషన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రైల్వే సిబ్బంది పోలీసులు ఉన్నఫలంగా ఆగి ఉన్న గుజరాత్ క్వీన్ ఎక్స్‌ప్రెస్‌ రైలులోకి పరుగులు తీస్తూ వెళ్లారు. అయితే ఆగి ఉన్న రైలులో ఒక యువతి మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు భావించిన అధికారులు వెంటనే ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

girl committed suicide in train police got her diary

కానీ ఆ యువతి డైరీ చదివిన పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. ఆ డైరీ చదివిన అనంతరం పోలీసులు ఆమె ఆత్మహత్య చేసుకుందని నిర్ధారణకు వచ్చారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏమిటి ? అనే విషయం గురించి తెలియాలంటే పోస్టుమార్టం రిపోర్ట్స్ వచ్చేవరకు చూడాలని తెలిపారు. ఇక ఆ యువతి డైరీలో ఏం రాసింది అనే విషయానికి వస్తే..

సౌత్ గుజరాత్ కు చెందిన ఆ యువతి వడోదరలోని ఒక హాస్టల్‌లో ఉంటూ ఓ ఎన్జీవో సంస్థలో పనిచేస్తోంది. తన డైరీలో రాసిన ప్రకారం.. ఈనెల 4వ తేదీన ఇద్దరు యువకులు ఆమెను కిడ్నాప్ చేసి కళ్ళకు గంతలు కట్టి ఆపై కాళ్లు, చేతులు కట్టేసి ఆటోలో ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకు వెళ్ళారు.

అయితే ఇది గమనించిన ఒక బస్సు డ్రైవర్ వారిని వెంబడించి వారి దగ్గరకు వెళ్ళాడు. అతనిని గమనించిన ఆ ఇద్దరు యువకులు భయంతో అక్కడినుంచి పారిపోయారు. ఆ బస్సు డ్రైవర్ సహాయంతో ఆమె తిరిగి ఎంతో సురక్షితంగా తన స్నేహితుల దగ్గరకు చేరుకుంది.

అయితే అలా ఆమెను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకు వెళ్లిన తర్వాత ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆ అవమానాన్ని భరించలేకే ఆ యువతి ఇలా ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో అసలు విషయం తెలియాలంటే పోస్టుమార్టం రిపోర్ట్స్ వచ్చే వరకు వేచి చూడాలని తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment