Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరోలు ఒక వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు మల్టీప్లెక్స్ లను ఏర్పాటు చేస్తున్నారు. మహేష్ బాబు ఇప్పటికే ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి ఏఎంబీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక మహేష్ బాబు దారిలోనే విజయ్ దేవరకొండ కూడా ఏవీడీని మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేశాడు. అల్లు అర్జున్ కూడా ఏఏఏ పేరుతో మల్టీ ప్లెక్స్ స్టార్ట్ చేస్తున్నాడు.
ఏషియన్ సంస్థతో కలిసి మల్టీ ప్లెక్స్ ను నిర్మిస్తుండగా, దీనికి ఏఏఏ అంటూ పేరు కూడా పెట్టారు. ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్ అనేది ఈ మల్టీప్లెక్స్ పేరు. ఇప్పటికే పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి అంటున్నారు. ప్రస్తుతం తుది దశకు పనులు చేరాయని, త్వరలోనే మల్టీప్లెక్స్ ను ప్రారంభిస్తారని అంటున్నారు. మల్టీప్లెక్స్ ను లగ్జరీయస్ డిజైన్ లతో నిర్మిస్తున్నారని తెలుస్తోంది.
ఈ థియేటర్లోని టెక్నాలజీ వండర్ పిల్లలను, పెద్లలను ఎంటర్టైన్ చేస్తుందట. లార్జ్ డిజిటల్ స్క్రీన్ మీద బన్నీ విజువల్ ఉంటుంది. దాని ముందు నిల్చున్నవారు ఏ హైట్ లో వుంటే ఆ హైట్ లోకి ఆ విజువల్ మారిపోతుంది. చిన్న పిల్లాడు ఉంటే ఆ సైజ్ లోకి, పెద్ద వాళ్లు ఉంటే పెద్ద సైజ్లోకి విజువల్ మారుతుంది.
పైగా ఆ డిజిటల్ స్క్రీన్ ముందు నిల్చున్నవారు ఎలా మూవ్ అయితే ఆ విజువల్ అలా మూవ్ అవుతుంది. ఎలా మాట్లాడితే అదే మాట్లాడుతుంది. దీనికి రూ.2 కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. మరి ఈ టెక్నాలజీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…