Getup Srinu : సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం లైగర్. ఇప్పటికే ఈ చిత్రం అన్ని పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. అనన్య పాండే లైగర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇక ఈ చిత్రంలో మైక్ టైసన్, రమ్యకృష్ణ, మకరంద్ దేశ్ పాండే, రోనిత్ రాయ్, అలీ, విష్ణు రెడ్డి, గెటప్ శ్రీను వంటివారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
పాన్ ఇండియా చిత్రంగా ఈ నెల ఆగస్టు 25న లైగర్ చిత్రం విడుదల కాబోతోంది. ఈ క్రమంలో లైగర్ చిత్ర ప్రమోషన్స్ భాగంగా వరంగల్ లో ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ లో గెటప్ శ్రీను కామెడీతో అందర్నీ ఆకర్షించాడు. పైసా వసూల్ చిత్రంలో బాలయ్య చెప్పిన తేడా.. తేడా సింగ్.. బాల్కనీ రెండు టికెట్లు డైలాగ్ ను గెటప్ శ్రీను మిమిక్రీ చేసి చూపించాడు. అంతే కాకుండా ఈ డైలాగ్ను విజయ్ దేవరకొండ చెప్తే ఎలా ఉంటుందో మిమిక్రీ చేసి చూపించి అందరూ పొట్టచెక్కలయ్యేలా నవ్వించాడు గెటప్ శ్రీను.
అంతే కాకుండా ఈ సినిమా కోసం తాను ఎదుర్కొన్న ఒక సంఘటనను అందరికీ తెలియజేశాడు. ఈ చిత్రంలో గెటప్ శ్రీను విజయ్ దేవరకొండ స్నేహితుడిగా చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం విజయ్ బ్యాంకాక్ వెళ్లి చాలా కష్టపడ్డాడు. విజయ్ ఫ్రెండ్ గా నటిస్తున్నాను కదా నేను కూడా ఏదైనా నేర్చుకోవాలనే ఉద్దేశంతో జిత్ క్వాండో నేర్చుకుందామని ట్రైనర్ ని పిలిపించుకున్నాను. అతడు మూడు రోజుల ట్రైనింగ్ కు రూ.50వేలు ఫీజు అడిగాడు. మన రేంజ్ అది కాదని చెప్పి వెంటనే అతనిని పంపించేశాను. ఇలా గెటప్ శ్రీను తనకు ఎదురైన సంఘటనలను ఈవెంట్ లో అందరి ముందు చెప్పుకొచ్చాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…