Rajnikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ నాలుగు దశాబ్ధాల పాటు ప్రేక్షకులని ఎంతగా అలరించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం ఇటీవల దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇచ్చి సత్కరించింది. ఇక రజనీకాంత్ అభిమానగణం ఏ రేంజ్లో ఉంటారో మనందరికి తెలిసిందే. తమిళనాడులో ఆయనంటే ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు.
తాజాగా ఓ అభిమాని రజనీకాంత్ కోసం తన హోటల్ లో ఒక్క రూపాయికే దోశలు పోసి విక్రయించాడు. తిరిచిలోని ఓ హోటల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. రజనీకాంత్పై ఉన్న అభిమానంతోనే ఇలాంటి ఆఫర్ ఇచ్చానంటున్నాడు. దీపావళి కానుకగా రజనీకాంత్ నటించిన పెద్దన్న (అన్నాతై ) సినిమా విజయవంతంగా ఆడాలని ఆకాంక్షిస్తూ ఈ పని చేసినట్లు కర్ణన్ చెప్పుకొచ్చాడు. ఆ దోశకు ‘అన్నాతై దోశ ‘ అని పేరుపెట్టాడు.
గతంలో రజనీకాంత్ కోసం ఆయన అభిమానులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు, పలు దానాలు కూడా చేశారు. రీసెంట్గా తలైవా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా, ఆయన కోలుకోవాలని రోజూ పూజలు చేశారు. రాను రాను అభిమానులలో రజనీకాంత్పై ప్రేమ, అభిమానులు పెరుగుతున్నాయే తప్ప తరగడం లేదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…