Shruti Haasan : శృతి హాసన్ ఈ మధ్య కాలంలో పలు వరుస సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉంటోంది. తెలుగులోనూ ఈమె పలు చిత్రాల్లో నటిస్తోంది. ఇక తాజాగా ఈమె ఇన్స్టాగ్రామ్ ద్వారా లైవ్ చాట్ సెషన్ నిర్వహించింది. అందులో తన ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పింది. అయితే ఒక నెటిజన్ మాత్రం ఆమెను ఇబ్బంది పెట్టే ప్రశ్న అడిగాడు.
తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో వారికి మాతృభాషపై మమకారం ఎక్కువ. హిందీని ఏమాత్రం సహించరు. గతంలో తమ భాషను కించ పరిచిన వారిపై వారు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. ఇలాంటి సంఘటనలు ఆయా రాష్ట్రాల్లో తరచూ జరుగుతూనే ఉంటాయి. హిందీ అంటే వారికి అసలు పడదు. అయితే ఓ నెటిజన్ శృతి హాసన్ను దీనిపైనే ప్రశ్న అడిగాడు. మీరు హిందీ మూవీల్లో కూడా నటించారు కదా, మీకు హిందీ మాట్లాడడం వచ్చా.. అని అడిగాడు.
ఇక అందుకు శృతి హాసన్ బదులిస్తూ.. ఇది 2022, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మనుషులందరూ ఒక్కటే. పక్షపాతం చూపించడం ఎందుకు, మన భూగ్రహం ఏమైనా ప్రత్యేకమా.. అందరం సినిమాలు తీస్తున్నాం, కష్టపడుతున్నాం, పక్షపాతం చూపించడం తగదు.. అని శృతి హాసన్ రిప్లై ఇచ్చింది.
శృతి హాసన్ గతంలో లక్, తెవార్, దిల్ తో బచా హై జీ, డి డే, వెల్కమ్ బ్యాక్, రాకీ హ్యాండ్సమ్, బెహెన్ హోగీ తేరీ వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఆమెకు అక్కడ అంతగా గుర్తింపు రాలేదు. కానీ తెలుగు సినిమాలతో ఆమె దశ తిరిగిపోయింది. ఇక ప్రస్తుతం శృతి హాసన్ తెలుగులో ప్రభాస్ పక్కన సలార్ మూవీలో నటిస్తోంది. ఈ మూవీని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీని విడుదల చేయనున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…