Shruti Haasan : శృతి హాసన్ ఈ మధ్య కాలంలో పలు వరుస సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉంటోంది. తెలుగులోనూ ఈమె పలు చిత్రాల్లో నటిస్తోంది. ఇక తాజాగా ఈమె ఇన్స్టాగ్రామ్ ద్వారా లైవ్ చాట్ సెషన్ నిర్వహించింది. అందులో తన ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పింది. అయితే ఒక నెటిజన్ మాత్రం ఆమెను ఇబ్బంది పెట్టే ప్రశ్న అడిగాడు.
తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో వారికి మాతృభాషపై మమకారం ఎక్కువ. హిందీని ఏమాత్రం సహించరు. గతంలో తమ భాషను కించ పరిచిన వారిపై వారు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. ఇలాంటి సంఘటనలు ఆయా రాష్ట్రాల్లో తరచూ జరుగుతూనే ఉంటాయి. హిందీ అంటే వారికి అసలు పడదు. అయితే ఓ నెటిజన్ శృతి హాసన్ను దీనిపైనే ప్రశ్న అడిగాడు. మీరు హిందీ మూవీల్లో కూడా నటించారు కదా, మీకు హిందీ మాట్లాడడం వచ్చా.. అని అడిగాడు.
ఇక అందుకు శృతి హాసన్ బదులిస్తూ.. ఇది 2022, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మనుషులందరూ ఒక్కటే. పక్షపాతం చూపించడం ఎందుకు, మన భూగ్రహం ఏమైనా ప్రత్యేకమా.. అందరం సినిమాలు తీస్తున్నాం, కష్టపడుతున్నాం, పక్షపాతం చూపించడం తగదు.. అని శృతి హాసన్ రిప్లై ఇచ్చింది.
శృతి హాసన్ గతంలో లక్, తెవార్, దిల్ తో బచా హై జీ, డి డే, వెల్కమ్ బ్యాక్, రాకీ హ్యాండ్సమ్, బెహెన్ హోగీ తేరీ వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఆమెకు అక్కడ అంతగా గుర్తింపు రాలేదు. కానీ తెలుగు సినిమాలతో ఆమె దశ తిరిగిపోయింది. ఇక ప్రస్తుతం శృతి హాసన్ తెలుగులో ప్రభాస్ పక్కన సలార్ మూవీలో నటిస్తోంది. ఈ మూవీని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీని విడుదల చేయనున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…