Dussehra 2022 Muhurat : ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు జరుపుకునే అనేక పండుల్లో దసరా ఒకటి. అయితే ఇది అతి పెద్ద పండుగ అని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంత వాసులు దసరాను వైభవంగా నిర్వహిస్తారు. బతుకమ్మ పండుగను కూడా ఇదే సమయంలో పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఇక దేశంలో అనేక చోట్ల 9 రోజుల పాటు దుర్గామాత విగ్రహాలను పూజించి ఆ తరువాత నిమజ్జనం చేస్తారు. చివరి రోజును విజయదశమి లేదా దసరాగా జరుపుకుంటారు. ఈ 9 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు.
ఇక దసరా పండుగ రోజు చాలా మంది కొత్త వ్యాపారాలను, పనులను ప్రారంభిస్తుంటారు. ఎందుకంటే ఆ రోజు ఏం చేసినా కలసి వస్తుందని చాలా మంది నమ్ముతారు. అదే రోజు రాముడు రావణాసురుడిపై యుద్ధం చేసి విజయం సాధించాడు. అలాగే పాండవులు కూడా యుద్ధంలో కౌరవులపై గెలుపొందారు. దీంతోపాటు దుర్గాదేవి కూడా రాక్షస సంహారం చేసింది అదే రోజు. కనుక ఆ రోజు ఎవరు ఏం చేసినా సరే.. కలసి వస్తుందని విశ్వసిస్తారు. అందుకనే దసరాను విజయాలు చేకూర్చే విజయదశమిగా జరుపుకుంటుంటారు.
ఇక ఈసారి దసరా పండుగ అక్టోబర్ 5న వచ్చింది. కానీ శుభ ముహుర్తం మాత్రం అక్టోబర్ 4 నుంచే ఉంది. అక్టోబర్ 4వ తేదీన రాత్రి 10.51 గంటల నుంచి అక్టోబర్ 5వ తేదీ రాత్రి 9.15 గంటల వరకు దసరా ముహుర్తం ఉంది. ఇక అమృత కాలం మాత్రం అక్టోబర్ 5వ తేదీన ఉదయం 11.33 గంటల నుంచి మధ్యాహ్నం 1.02 గంటల వరకు ఉంది. కనుక ఎవరైనా ఏం చేయాలన్నా సరే.. ఈ సమయంలో చేస్తే.. అంతా మంచే జరుగుతుంది.
ఇక దసరా రోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసి కుటుంబం మొత్తం తలస్నానం చేయాలి. అనంతరం దుర్గామాతకు పూజ చేయాలి. ముఖ్యంగా బెల్లం, అరటి పండ్లు, బియ్యంను పూజలో తప్పక ఉంచాలి. అనంతరం వీటిని పేదలకు లేదా బ్రాహ్మణులకు దానం చేయాలి. వారికి ఇవే కాకుండా ఏవైనా ఇతర వస్తువులు లేదా ఆహారాలు కూడా దానం చేయవచ్చు. తరువాత పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. ఇలా దసరా శుభ ముహుర్తం సమయంలో చేస్తే.. అంతా మంచే జరుగుతుంది. ఎవరైనా ఏం వ్యాపారం మొదలు పెట్టినా సరే కలసి వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. అదృష్టం కలసి వస్తుంది. ఇంట్లోని అందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తారు. కనుక దసరా రోజు ఇలా చేయడం మరిచిపోకండి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…