Niharika : తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ఎప్పటికీ ప్రత్యేకమే. ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోల సంఖ్య ఎక్కువే మరి. మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో కెమెరా ముందుకు వచ్చి తమ టాలెంట్ ని ప్రజంట్ చేస్తారు. మెగాస్టార్ చిరంజీవితోపాటు ఆయన తమ్ముళ్ళకు కూడా ఇండస్ట్రీ అంతే రెస్పెక్ట్ ఇస్తుంది.
ఇక ఆయన తమ్ముళ్ళు కూడా చిరు బాటలోనే నడుస్తూ.. ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి పరిచయం అయిన ఒకే ఒక హీరోయిన్ నిహారిక. మరి నిహారికకు ఈ ముగ్గురు అన్నదమ్ముల్లో ఎవరంటే ఎక్కువ.. అనే విషయాన్ని బయటపెట్టేసింది.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకి వచ్చిన నిహారిక.. తన ఫ్యామిలీ, పర్సనల్ విశేషాలను చాలా వరకు షేర్ చేసుకుంది. నవంబర్ 22న ఈ ప్రోగ్రామ్ బుల్లితెరపై ప్రసారం కానుంది. ప్రముఖ టీవీ ఛానల్ లో వస్తున్న ఆలీతో సరదాగా అనే ప్రోగ్రామ్ కి సంబంధించిన ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ అవుతోంది.
నిహారిక తన ఫ్యామిలీ మెంబర్స్ తో ఉన్న బాండింగ్ గురించి.. తన మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ గురించి చెప్పింది. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్.. వీరి ముగ్గురిలో నిహారికకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అడిగిన ప్రశ్నకు నిహారిక క్లారిటీ ఇచ్చింది.
నాన్న లేకుంటే చచ్చిపోతా అంటూ నాగబాబు అంటేనే తనకు చాలా ఇష్టమని చెప్పింది. మీ నాన్న మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టారా.. అని అడిగితే.. చిన్నప్పుడు ఓ సారి కొట్టారని.. అది కూడా వీపు మీద అని చెప్పింది. నాగబాబు, నిహారికను మమ్మీ అని పిలుస్తారట.
అలాగే వరుణ్ తేజ్ తనను ముద్దొస్తే.. బంగారం అని, ఇంకా ముద్దొస్తే పంది.. అని పిలుస్తాడట. ఈ షోకి సంబంధించిన ప్రోమోతో సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…