పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ముఖ్యమైన ఘట్టం. ఒకప్పుడు పెళ్లి అంటే భార్యాభర్తలు నిండు నూరేళ్ల పాటు కలిసి ఉండే దాంపత్య జీవితంగా ఉండేది. కానీ ప్రస్తుత ఆధునిక యుగంలో పెళ్లి అనే పదానికి అర్థం మారిపోయింది. ఒక్కొక్కరి జీవితంలో ఎన్ని పెళ్లిళ్లు జరుగుతున్నాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే సీనియర్ నటుడు నరేష్ కు మూడు పెళ్లిళ్లు కాగా.. ఇప్పుడు పవిత్రా లోకేష్తో నాలుగో పెళ్లికి కూడా సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మెగా ఫ్యామిలీలో కొందరికి రెండు లేదా మూడు పెళ్లిళ్లు కూడా జరిగాయి. మెగా ఫ్యామిలీలో ఒకటికి మించి పెళ్లిళ్లు చేసుకున్న వారు ఎవరో చూద్దాం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో కూడా వ్యక్తిగత జీవితం గురించే మాట్లాడుతూ మూడు పెళ్లిళ్లు అంటూ ఉంటారు. పవన్ సినిమాల్లోకి రాకముందు వైజాగ్ కు చెందిన నందినిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తనతో బద్రి, జానీ సినిమాల్లో నటించిన రేణు దేశాయ్ ను రెండో పెళ్లి చేసుకోగా.. తీన్మార్ సినిమాలో నటించిన రష్యన్ అమ్మాయి అన్నా లెజ్నోవాను మూడో పెళ్లి చేసుకున్నారు.
చిరంజీవి చెల్లెలు హీరో సాయి ధరమ్ తేజ్ తల్లి విజయదుర్గకు కూడా పెళ్లి కలిసి రాలేదు. సాయిధరమ్ తేజ్ – వైష్ణవ తేజ్ పుట్టాక భర్తతో విడాకులు అయ్యాయి. దాదాపు 15 – 20 సంవత్సరాల పాటు ఆమె భర్తకు దూరంగానే ఉంది. వీరిద్దరూ పెరిగి పెద్దయ్యాక తనకు తోడు కావాలనుకున్న విజయదుర్గ ఓ డాక్టర్ను రెండో పెళ్లి చేసుకుంది.
చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ తాను ప్రేమించిన శిరీష్ భరద్వాజ్ను ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. ఒక కుమార్తె పుట్టాక భరద్వాజ్ కు విడాకులు ఇచ్చేసిన శ్రీజ కళ్యాణ్దేవ్ ను రెండో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు కళ్యాణ్ దేవ్కు కూడా ఆమె విడాకులు ఇస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
అల్లు కుటుంబాన్ని కూడా మెగా ఫ్యామిలీ నుంచి దూరంగా చూడలేము. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదటి భార్యతో ఒక కూతురు పుట్టాక విడిపోయి ఇప్పుడు ముంబైకి చెందిన డిజైనర్ను రెండో పెళ్లి చేసుకున్నారు. అలా మెగా కాంపౌండ్లో నలుగురికి ఒకటికి మించిన పెళ్లిళ్లు జరిగాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…