పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ముఖ్యమైన ఘట్టం. ఒకప్పుడు పెళ్లి అంటే భార్యాభర్తలు నిండు నూరేళ్ల పాటు కలిసి ఉండే దాంపత్య జీవితంగా ఉండేది. కానీ ప్రస్తుత ఆధునిక యుగంలో పెళ్లి అనే పదానికి అర్థం మారిపోయింది. ఒక్కొక్కరి జీవితంలో ఎన్ని పెళ్లిళ్లు జరుగుతున్నాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే సీనియర్ నటుడు నరేష్ కు మూడు పెళ్లిళ్లు కాగా.. ఇప్పుడు పవిత్రా లోకేష్తో నాలుగో పెళ్లికి కూడా సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మెగా ఫ్యామిలీలో కొందరికి రెండు లేదా మూడు పెళ్లిళ్లు కూడా జరిగాయి. మెగా ఫ్యామిలీలో ఒకటికి మించి పెళ్లిళ్లు చేసుకున్న వారు ఎవరో చూద్దాం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో కూడా వ్యక్తిగత జీవితం గురించే మాట్లాడుతూ మూడు పెళ్లిళ్లు అంటూ ఉంటారు. పవన్ సినిమాల్లోకి రాకముందు వైజాగ్ కు చెందిన నందినిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తనతో బద్రి, జానీ సినిమాల్లో నటించిన రేణు దేశాయ్ ను రెండో పెళ్లి చేసుకోగా.. తీన్మార్ సినిమాలో నటించిన రష్యన్ అమ్మాయి అన్నా లెజ్నోవాను మూడో పెళ్లి చేసుకున్నారు.
చిరంజీవి చెల్లెలు హీరో సాయి ధరమ్ తేజ్ తల్లి విజయదుర్గకు కూడా పెళ్లి కలిసి రాలేదు. సాయిధరమ్ తేజ్ – వైష్ణవ తేజ్ పుట్టాక భర్తతో విడాకులు అయ్యాయి. దాదాపు 15 – 20 సంవత్సరాల పాటు ఆమె భర్తకు దూరంగానే ఉంది. వీరిద్దరూ పెరిగి పెద్దయ్యాక తనకు తోడు కావాలనుకున్న విజయదుర్గ ఓ డాక్టర్ను రెండో పెళ్లి చేసుకుంది.
చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ తాను ప్రేమించిన శిరీష్ భరద్వాజ్ను ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. ఒక కుమార్తె పుట్టాక భరద్వాజ్ కు విడాకులు ఇచ్చేసిన శ్రీజ కళ్యాణ్దేవ్ ను రెండో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు కళ్యాణ్ దేవ్కు కూడా ఆమె విడాకులు ఇస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
అల్లు కుటుంబాన్ని కూడా మెగా ఫ్యామిలీ నుంచి దూరంగా చూడలేము. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదటి భార్యతో ఒక కూతురు పుట్టాక విడిపోయి ఇప్పుడు ముంబైకి చెందిన డిజైనర్ను రెండో పెళ్లి చేసుకున్నారు. అలా మెగా కాంపౌండ్లో నలుగురికి ఒకటికి మించిన పెళ్లిళ్లు జరిగాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…