Mega Heroes : మెగా ఫ్యామిలీ అంటే ఇండస్ట్రీలో కానీ అభిమానుల్లో కానీ ఒకరకమైన గౌరవం, అభిమానం ఉంటాయి. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చే హీరోలకు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మన మెగా హీరోస్ కి మాత్రం కొందరిపై క్రష్ ఉందట, అంతేకాదు ఒక అడుగు ముందుకేసి రిలేషన్స్ లో కూడా ఉన్నారట. మన స్టార్ హీరోస్ కి ఎవరెవరితో ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం.
నాగబాబు కొడుకైన వరుణ్ కొత్త కొత్త కథలను ఎంచుకుంటూ హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నాడు. అయితే వరుణ్ రెండు సంవత్సరాలుగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో డేటింగ్ చేస్తున్నాడని వార్త వైరల్ అవుతూనే ఉంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ మిస్టర్, అంతరిక్షం సినిమాల్లోని కలిసిన నటించారు. ఏకంగా మెగా ఫ్యామిలీ ఇంటి కోడలు లావణ్య త్రిపాఠి అంటూ వార్తలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇప్పటి వరకు దీనిపై ఇద్దరూ ఎప్పుడూ, ఎక్కడా స్పందించలేదు. ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరూ ఓ బర్త్డే పార్టీలో సందడి చేయడంతో మరోసారి వీరి డేటింగ్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక మెగా మేనల్లుడు సుప్రీమ్ స్టార్ సాయిధరమ్ తేజ్ కి కూడా అమ్మాయిల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే సాయిధరమ్ తేజ్ కి రెజీనా కసాండ్రాతో ఎఫైర్ ఉంది అంటూ అనేక రోజులుగా వార్తలు వచ్చాయి. వాస్తవానికి సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమా రెజీనా కసాండ్రతో పిల్ల నువ్వు లేని జీవితం, ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, నక్షత్రం సినిమాలు వచ్చాయి. ఇలా వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాలు రాగా ఈ వార్తలకు బలం చేకూరింది. అలాగే కొన్నాళ్లపాటు వీరిద్దరూ బ్రేకప్ అయినా మళ్లీ కలిసే ఉంటున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మరోవైపు అల్లు శిరీష్ కూడా ఎప్పుడూ ఎఫైర్స్ తో వార్తల్లో ఉంటుంటాడు. అను ఇమ్మానుయేల్ తో ప్రేమ కాదంటా అనే సినిమాలో కలిసి నటించగా ఈ వార్తలకు ఈ సినిమాతోనే ఆరంభం అయింది. వీరిద్దరూ కలిసి ఎఫైర్ లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఈ వార్తల్లో నిజం ఎంతో తెలీదు కానీ ఇలా మెగా హీరోస్ చుట్టూ ఎప్పుడూ హీరోయిన్స్ తో వార్తలు అల్లేసుకోవడం కామన్ గా మారింది.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…