Baahubali : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు పార్ట్లుగా వచ్చిన ఈ మూవీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. నిర్మాతలకు కాసుల పంటను కురిపించింది. రెండు మూవీలకు కలిపి సుమారుగా రూ.500 కోట్ల బడ్జెట్ కాగా.. రూ.2000 కోట్ల వరకు ఈ మూవీలు వసూలు చేయడం విశేషం. ఈ మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయంతో అలరించాడు. అలాగే భల్లాల దేవుడి పాత్రలో రాణా ఆకట్టుకున్నాడు. ఇక అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, కిచ్చ సుదీప్ వంటి వారు అద్భుతంగా నటించారు. అలాగే కట్టప్ప పాత్ర చేసిన సత్యరాజ్కు కూడా బాగానే పేరు వచ్చింది.
బాహుబలి సినిమాల ద్వారా రాణా, ప్రభాస్లు పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. దీంతో వారి సినిమాలకు క్రేజ్ ఏర్పడింది. అయితే బాహుబలి సినిమాలు వచ్చి అన్ని సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ వీటి గురించి ఏదో ఒక విషయం బయట పడుతూనే ఉంది. తాజాగా ఈ మూవీలోని పాటకు చెందిన వివరాలు వైరల్ అవుతున్నాయి. బాహుబలి మొదటి పార్ట్లో అవంతికను వెదుకుతూ శివుడు అలియాస్ మహేంద్ర బాహుబలి వెళ్తాడు. ఆ సమయంలో ఒక సాంగ్ వస్తుంది. ఆ తరువాత ఇద్దరూ కలసిపోతారు. అప్పుడు ఇంకో పాట వస్తుంది. అయితే ఈ పాటలకు చెందిన బడ్జెట్ వివరాలే దిమ్మతిరిగిపోయేలా ఉన్నాయి.
అప్పట్లో ఈ రెండు పాటలకు ఒక్కో దానికి రూ.2.50 కోట్ల చొప్పున రూ.5 కోట్లు ఖర్చు చేశారట. కేవలం పాటలనే అత్యంత అద్భుతమైన గ్రాఫిక్స్ తో రూపొందించారు. కనుకనే ఆ పాటలు ఆ స్థాయిలో ఫేమస్ అయ్యాయి. ధీవరా.. అనే పాటతోపాటు పచ్చ బొట్టేసినా.. అనే సాంగ్.. ఈ రెండూ కలిపి రూ.5 కోట్ల మేర ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అప్పటి ఆ పాటలకు చెందిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…