Pokiri Movie : తెలుగు తెరపై ప్రేక్షకులకు ఓ రాముడిగా, కృష్ణుడిగా ముందు గుర్తుకు వచ్చేది నందమూరి తారక రామారావు. తెలుగు తెరపై రికార్డులు క్రియేట్ చేసిన నందమూరి తారక రామారావు నటుడిగానే కాదు, దర్శకుడిగా కూడా మంచి ప్రతిభను చూపించారు. 1977లో ఎన్టీఆర్ నటించి దర్శకత్వం వహించిన చిత్రం దానవీరశూరకర్ణ. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, కర్ణుడుగా త్రిపాత్రాభినయం చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
అప్పట్లో ఈ చిత్రం 10 లక్షల రూపాయల కన్నా తక్కువ బడ్జెట్ తో రూపొంది బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి కోటి రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది. మరలా ఈ చిత్రం తిరిగి 17 ఏళ్ల తర్వాత అంటే 1994లో భారీ ఎత్తున విడుదలై 60 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు కోటి రూపాయలకుపైగా ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. అప్పటి తరంలో ఎన్టీఆర్ క్రియేట్ చేసిన రికార్డుని ఈ తరంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి కూడా ఇలాంటి రికార్డునే క్రియేట్ చేసింది.
ఈ ఆగస్టు 9న సాయంత్రం రీ రిలీజ్ చేసిన పోకిరి సినిమా స్పెషల్ ప్రీమియర్లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దాదాపు 15 సంవత్సరాల తర్వాత రీ రిలీజ్ అయిన పోకిరి చిత్రం ఒక ఆర్టీసీ క్రాస్ రోడ్లోనే ఆరు లక్షల రూపాయల వసూళ్లను రాబట్టింది అంటే మామూలు విషయం కాదు. పోకిరి చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా 200 థియేటర్ లలో విడుదల చేశారు.
ట్రేడ్ వర్గాల అభిప్రాయం ప్రకారం పోకిరి చిత్రం మూడు కోట్లకుపైగానే కలెక్షన్లు రాబట్టిందని తెలుస్తోంది. దానవీరశూరకర్ణ తర్వాత మరలా అదే స్థాయిలో పోకిరి చిత్రం రికార్డులను సృష్టించింది. ఈ తరహాలో రీ రిలీజ్ అయిన ఘరానా మొగుడు, తొలిప్రేమ చిత్రాలు కూడా పోకిరి చిత్రం స్థాయిలో రికార్డులను క్రియేట్ చేయలేకపోయాయి. దీన్ని బట్టి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రానికి ఉన్న సత్తా ఏంటో వేరే చెప్పాల్సిన పనిలేదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…