Bhallala Deva : తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన విజువల్ వండర్ బాహుబలి. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2015 జూలై 10న విడుదలైన బాహుబలి-ది బిగినింగ్ చిత్రం అందరినీ అలరించింది. బాహుబలి మొదటి భాగం విడుదలైనప్పుడు ఆ చిత్రం యావద్భారతాన్నీ అలరించింది. అయితే బాహుబలి-1 లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ? అన్న ప్రశ్నను వదిలి, సశేషం అన్నారు. ఇక అప్పటి నుండి సెకండ్ పార్ట్పై అందరిలోనూ ఆసక్తి పెరిగింది.
అనేక అంచనాల నడుమ బాహుబలి-2 మూవీ 2017 ఏప్రిల్ 28న విడుదలయింది. అనూహ్య విజయం సాధించింది. భారతదేశంలో రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసిన తొలి చిత్రంగా చరిత్రలో నిలిచింది. తెలుగులో రూపొంది.. తమిళ, మళయాళ, హిందీ భాషల్లోకి అనువాదమైన బాహుబలి 2 కనీవినీ ఎరుగని విజయాన్ని సాధించి అందరి దృష్టినీ టాలీవుడ్పై పడేలా చేసింది. బాహుబలి 2 అప్పుడే రూ.1600 కోట్లుకుపైగా కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇది రిలీజ్ అయితే మినిమం రూ.2 వేల కోట్లు కొల్లగొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
అయితే బాహుబలి చిత్రంలో రానా భళ్లాల దేవుడిగా కనిపించాడు. బాహుబలి చనిపోయిన తర్వాత రానా వృద్ధ భళ్లాలదేవుడిగా కనిపించాడు. అయితే సెకండ్ పార్ట్లో ఆయన ముఖంపై గీత ఉంటుంది. అది ఎందుకు వచ్చిందనే విషయం బాహుబలి అభిమానులకి ఎవరికైనా గుర్తుందా ? ఆ గీతని భళ్లాలదేవుడు తనకు తానే పెట్టుకుంటాడు. కుమార వర్మ తనకు హాని కలిగించడానికి వచ్చినట్టు అందరినీ నమ్మించడానికి పెట్టుకుంటాడు. ఈ గీత ఎక్కడా మిస్ కాకుండా రాజమౌళి చాలా జాగ్రత్తపడ్డాడు. అందుకనే మూవీ చాలా చోట్ల రానా ముఖంపై మనకు ఆ గీత కనిపిస్తుంది. సినిమాలో చిన్న చిన్న అంశాలపై కూడా రాజమౌళి ఎంత జాగ్రత్త వహిస్తాడో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇక రాజమౌళి త్వరలోనే మహేష్ తో సినిమా చేయనున్నారు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…