Bimbisara : 2015 లో విడుదలైన పటాస్ చిత్రంతో కల్యాణ్ రామ్ హిట్ను అందుకోగా.. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు అన్నీ ఫ్లాప్ గా నిలిచాయి. ఈ ఏడాది ఆగస్టు 5న విడుదలైన బింబిసార చిత్రంతో సక్సెస్ ని అందుకున్నాడు కళ్యాణ్ రామ్. బింబిసార చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి సక్సెస్ దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్ర విజయంతో కళ్యాణ్ రామ్ తిరిగి సక్సెస్ ఫేమ్ లోకి వచ్చేశాడు. ఎటువంటి హడావుడి లేకుండా విడుదలైన బింబిసార చిత్రం వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల బాటలో పయనిస్తోంది.
ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ ద్వారా యువ దర్శకుడు వశిష్టను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ నిర్మించారు. ఒక పవర్ ఫుల్ కథాంశాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయడంలో వశిష్ట సక్సెస్ ను సాధించారని చెప్పవచ్చు. ఎమ్ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ నటన పరంగా అందరి దృష్టినీ ఆకర్షించారు.
ప్రముఖ టాలీవుడ్ హీరోలు సైతం కళ్యాణ్ రామ్ నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసే దిశగా దూసుకుపోతోంది. అయితే వశిష్ట ఈ చిత్ర కథను కళ్యాణ్ రామ్ కంటే ముందు నలుగురు హీరోలకు చెప్పాడట. బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన ఆ నలుగురు హీరోలు ఎవరంటే..
మొదటగా వశిష్ట ఈ చిత్ర కథను నితిన్ తో చర్చలు జరపగా నితిన్ ఈ కథను రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనిని సంప్రదించగా ఇలాంటి కథ తనకు సెట్ కాదని నో చెప్పేశాడట. ఆ తరవాత అల్లు శిరీష్, రాజ్ తరుణ్ వంటి వారితో కూడా కథ గురించి చర్చలు జరపగా వారు కూడా బింబిసారలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదట. చివరికి ఈ చిత్రం కళ్యాణ్ రామ్ ని వరించింది.
ఒకవేళ ఈ నలుగురిలో ఏ ఒక్కరు బింబిసార చిత్రంలో హీరోగా నటించినా కచ్చితంగా సక్సెస్ అయ్యి ఉండేదికాదు. కళ్యాణ్ రామ్ మాత్రమే బింబిసార చిత్రానికి అత్యద్భుతంగా సెట్ అయ్యాడు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ నటన అదరహో అనిపించే విధంగా ఉంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…