హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎన్నో విషయాలలో సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్క కార్యం కూడా శాస్త్రం ప్రకారం జరగాలని భావిస్తారు. అయితే ప్రస్తుత కాలంలో శాస్త్రాల గురించి చెప్పే వారు కానీ, వినే వారు కానీ లేకపోవడం గమనార్హం.
అయితే శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాంటి వస్తువులను పొరపాటున కూడా కింద పెట్టకూడదని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా పూజకు ఉపయోగించే పువ్వులు, పసుపు, కుంకుమ, టెంకాయ వంటి వస్తువులను పొరపాటున కూడా కింద పెట్టకూడదు. వీటితోపాటు మరికొన్ని వస్తువులను కూడా కింద పెట్టకూడదు.
ప్రతి ఒక్కరూ ఆ భగవంతుడిని స్మరిస్తూ దీపారాధన చేస్తుంటారు. దీపం వెలిగించిన తరువాత ఎలాంటి పరిస్థితులలో కూడా దీపాన్ని కింద పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల ఆ దేవ దేవతలను అవమానించినట్టే. కనుక దీపం వెలిగించేటప్పుడు కింద ఏదైనా ఆకు లేదా ధాన్యం లేదా చిన్న ఇత్తడి కంచు ప్లేట్ ను పెట్టాలి.
బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము. కనుక ఎలాంటి పరిస్థితులలోనూ బంగారాన్ని కింద పెట్టకూడదు. బంగారంను కింద పెట్టడం వల్ల లక్ష్మీదేవిని అవమానించినట్లేనని పండితులు చెబుతున్నారు.
హిందూ సాంప్రదాయాల ప్రకారం జంధ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఎంతో పవిత్రమైన ఈ జంధ్యాన్ని కింద పెట్టడం వల్ల సాక్షాత్తూ తల్లిదండ్రులను, గురువులను అవమానించినట్లే.
సాలి గ్రామాన్ని సాక్షాత్తూ విష్ణు స్వరూపంగా భావిస్తారు. ఎంతో పవిత్రమైన ఈ సాలిగ్రామాలను కింద పెట్టడం వల్ల సమస్యలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు. కనుక వీటిని కూడా కింద పెట్టరాదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…