హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎన్నో విషయాలలో సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్క కార్యం కూడా శాస్త్రం ప్రకారం జరగాలని భావిస్తారు. అయితే ప్రస్తుత కాలంలో శాస్త్రాల గురించి చెప్పే వారు కానీ, వినే వారు కానీ లేకపోవడం గమనార్హం.
అయితే శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాంటి వస్తువులను పొరపాటున కూడా కింద పెట్టకూడదని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా పూజకు ఉపయోగించే పువ్వులు, పసుపు, కుంకుమ, టెంకాయ వంటి వస్తువులను పొరపాటున కూడా కింద పెట్టకూడదు. వీటితోపాటు మరికొన్ని వస్తువులను కూడా కింద పెట్టకూడదు.
ప్రతి ఒక్కరూ ఆ భగవంతుడిని స్మరిస్తూ దీపారాధన చేస్తుంటారు. దీపం వెలిగించిన తరువాత ఎలాంటి పరిస్థితులలో కూడా దీపాన్ని కింద పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల ఆ దేవ దేవతలను అవమానించినట్టే. కనుక దీపం వెలిగించేటప్పుడు కింద ఏదైనా ఆకు లేదా ధాన్యం లేదా చిన్న ఇత్తడి కంచు ప్లేట్ ను పెట్టాలి.
బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము. కనుక ఎలాంటి పరిస్థితులలోనూ బంగారాన్ని కింద పెట్టకూడదు. బంగారంను కింద పెట్టడం వల్ల లక్ష్మీదేవిని అవమానించినట్లేనని పండితులు చెబుతున్నారు.
హిందూ సాంప్రదాయాల ప్రకారం జంధ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఎంతో పవిత్రమైన ఈ జంధ్యాన్ని కింద పెట్టడం వల్ల సాక్షాత్తూ తల్లిదండ్రులను, గురువులను అవమానించినట్లే.
సాలి గ్రామాన్ని సాక్షాత్తూ విష్ణు స్వరూపంగా భావిస్తారు. ఎంతో పవిత్రమైన ఈ సాలిగ్రామాలను కింద పెట్టడం వల్ల సమస్యలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు. కనుక వీటిని కూడా కింద పెట్టరాదు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…