Divyansha Kaushik : అక్కినేని నాగేశ్వర్ రావు నట సామ్రాట్గా తెలుగు ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకుంటే.. ఆయన తరువాత నాగార్జున యువ సామ్రాట్ అయ్యారు. నాగార్జునకు కూడా అశేష ప్రేక్షకాదరణ ఉంది. అయితే నాగార్జున తరువాత ఆయన కుమారులు నాగచైతన్య, అఖిల్.. మొదట్లో అంతగా సక్సెస్ కాలేదు. కానీ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుని విజయాల బాటలో నడుస్తున్నారు. ఇక నాగచైతన్య ప్రస్తుతం స్టార్ హీరోల లిస్ట్లోనూ చేరిపోయాడు. చైతూ తను ప్రేమించిన సమంతను గతంలో పెళ్లి చేసుకున్నాడు. ఎన్నో ఏళ్ల ప్రేమ అనంతరం పెళ్లి చేసుకుని ఎన్నో ఏళ్ల పాటు అన్యోన్యంగా ఉన్నారు. కానీ ఏం జరిగిందో తెలియదు. ఇద్దరూ అనుకోకుండా విడిపోయారు. తరువాత ఎవరి సినిమాలతో వారు బిజీగా మారిపోయారు. ఈ క్రమంలోనే నాగచైతన్యను మొదట్లో జెంటిల్మన్ అనే వారు. కానీ ఇప్పుడు మన్మథుడు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మళ్లీ సింగిల్ గానే ఉంటున్నాడుగా.. అందుకని..
ఇక నాగచైతన్య ఫలానా హీరోయిన్తో ప్రేమలో ఉన్నాడు.. అని ఇప్పటికే అనేక సార్లు వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి ఇలాంటి వార్తలే వస్తున్నాయి. గత కొద్ది రోజుల కిందట రాశీఖన్నాతో అతను ప్రేమలో ఉన్నాడని, అలాగే సాయి పల్లవి అని గుసగుసలు వినిపించాయి. తరువాత శోభిత ధూళిపాళ అన్నారు. ఇక ఇప్పుడు ఇంకో హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఆ హీరోయిన్తో చైతూ బాగా క్లోజ్గా ఉంటున్నాడని.. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆమెనే.. దివ్యాంశ కౌశిక్. మజిలీలో చైతూ పక్కన చేసింది. అయితే ఆమెకు ఆ ఆఫర్ను చైతన్యనే ఇప్పించాడని తెలుస్తోంది.
కాగా ఆ వార్తలపై ఇటీవల దివ్యాంశ కౌశిక్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఐ లవ్ నాగచైతన్య, అతని పై క్రష్ ఉంది. చుడ్డానికి బాగుంటాడని చెప్పింది. అలా అని మా మధ్య ఏదో ఉందని అనుకుంటే పొరపాటు.. మా మధ్య అలాంటిది ఏమీ లేదని స్పష్టం చేసింది. మేం పెళ్లి చేసుకుంటాం అని వచ్చిన వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని తెలియజేసింది. అయినప్పటికీ ఇద్దరి మధ్య ఏదో ఉందని.. వీరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…