కోలీవుడ్లో స్టార్ జంటగా ఉన్న ధనుష్ – ఐశ్వర్య ఈ ఏడాది ప్రారంభంలో విడిపోతున్నట్టు ప్రకటించి ఫ్యాన్స్కు షాకిచ్చారు. సుమారు 18 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న వీరు విడిపోతున్నట్లు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఎప్పటికైనా కలవకపోతారా ? అని అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో సోషల్ మీడియా ఖాతాల్లో పేరు చివరన ఉన్న ధనుష్ను తొలగించి ఐశ్వర్య రజనీకాంత్గా మార్చేసుకుంది. వీరు విడిపోయాక కలిసి కనిపించిన సందర్భాలు లేవు. కాకపోతే తన ఇద్దరు కుమారులను తీసుకొని ధనుష్ ఓసారి ఇళయరాజా సంగీత కచేరీకి వెళ్లాడు.
ఇదిలా ఉంటే విడాకుల అనంతరం తొలిసారి కలిసి కనిపించారు ధనుష్ ఐశ్వర్య. పెద్ద కొడుకు యాత్ర స్కూల్లో జరిగిన ఓ కార్యక్రమానికి మాజీ దంపతులిద్దరూ హాజరయ్యారు. ఈ రోజు ఎంత బాగా మొదలయ్యిందో.. నా పెద్ద కొడుకు స్పోర్ట్స్ కెప్టెన్గా ఎంపికయ్యాడు.. అంటూ సోమవారం ఓ ఫోటో వదిలింది ఐశ్వర్య. అదే సమయంలో ఓ ఫ్యామిలీ పిక్ను సైతం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.
అందులో ధనుష్, ఐశ్వర్య.. తమ పిల్లలతో కలిసి కెమెరావైపు నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. ఈ ఫొటో చూసిన అభిమానులు వీరు మళ్లీ కలిసిపోయారా..? అని కామెంట్లు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో సెలబ్స్ విడిపోయినా కూడా పిల్లల కోసం కొన్ని సందర్భాలలో కలుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ధనుష్- ఐశ్వర్య కలిసి కట్టుగా కనిపించారు. ఇక ధనుష్ తెలుగు, తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరోపక్క ఐశ్వర్య రజనీకాంత్.. డైరెక్టర్గా బాలీవుడ్లో అడుగుపెట్టబోతుంది. హిందీలో ఓ సాథీ చల్ అనే ప్రేమకథా చిత్రాన్ని ఆమె డైరెక్ట్ చేస్తోంది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…