కోలీవుడ్లో స్టార్ జంటగా ఉన్న ధనుష్ – ఐశ్వర్య ఈ ఏడాది ప్రారంభంలో విడిపోతున్నట్టు ప్రకటించి ఫ్యాన్స్కు షాకిచ్చారు. సుమారు 18 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న వీరు విడిపోతున్నట్లు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఎప్పటికైనా కలవకపోతారా ? అని అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో సోషల్ మీడియా ఖాతాల్లో పేరు చివరన ఉన్న ధనుష్ను తొలగించి ఐశ్వర్య రజనీకాంత్గా మార్చేసుకుంది. వీరు విడిపోయాక కలిసి కనిపించిన సందర్భాలు లేవు. కాకపోతే తన ఇద్దరు కుమారులను తీసుకొని ధనుష్ ఓసారి ఇళయరాజా సంగీత కచేరీకి వెళ్లాడు.
ఇదిలా ఉంటే విడాకుల అనంతరం తొలిసారి కలిసి కనిపించారు ధనుష్ ఐశ్వర్య. పెద్ద కొడుకు యాత్ర స్కూల్లో జరిగిన ఓ కార్యక్రమానికి మాజీ దంపతులిద్దరూ హాజరయ్యారు. ఈ రోజు ఎంత బాగా మొదలయ్యిందో.. నా పెద్ద కొడుకు స్పోర్ట్స్ కెప్టెన్గా ఎంపికయ్యాడు.. అంటూ సోమవారం ఓ ఫోటో వదిలింది ఐశ్వర్య. అదే సమయంలో ఓ ఫ్యామిలీ పిక్ను సైతం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.
అందులో ధనుష్, ఐశ్వర్య.. తమ పిల్లలతో కలిసి కెమెరావైపు నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. ఈ ఫొటో చూసిన అభిమానులు వీరు మళ్లీ కలిసిపోయారా..? అని కామెంట్లు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో సెలబ్స్ విడిపోయినా కూడా పిల్లల కోసం కొన్ని సందర్భాలలో కలుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ధనుష్- ఐశ్వర్య కలిసి కట్టుగా కనిపించారు. ఇక ధనుష్ తెలుగు, తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరోపక్క ఐశ్వర్య రజనీకాంత్.. డైరెక్టర్గా బాలీవుడ్లో అడుగుపెట్టబోతుంది. హిందీలో ఓ సాథీ చల్ అనే ప్రేమకథా చిత్రాన్ని ఆమె డైరెక్ట్ చేస్తోంది.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…