Deepthi Sunaina : బిగ్ బాస్ పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేర్లు.. దీప్తి సునైన, షణ్ముఖ్.. గత బిగ్ బాస్ సీజన్లో విన్నర్ కన్నా రన్నరప్ అయిన షణ్ముఖ్ కే పాపులారిటీ ఎక్కువ వచ్చింది. కారణం.. షోలో సిరితో కలిసి చేసిన రచ్చే అని చెప్పవచ్చు. షో ముగిశాక కొన్ని రోజులకు దీప్తి సునైన, షణ్ముఖ్ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. దీంతో ఈ విషయం సంచలనంగా మారింది. బిగ్ బాస్ షో గురించి మరిచిపోయి నెటిజన్లు వీరి గురించి చర్చించుకోవడం మొదలు పెట్టారు.
అయితే ఈ మధ్య కాలంలో ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు పరోక్షంగా పోస్టులు పెట్టుకుంటున్నారు. దీంతో ఆ పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న వార్త ప్రకారం.. త్వరలోనే ఈ లవ్ బర్డ్స్ మళ్లీ కలవబోతున్నారని తెలుస్తోంది. ఇది నెటిజన్లను షాక్కు గురి చేస్తోంది.
లవ్ బర్డ్స్ దీప్తి సునైన, షణ్ముఖ్లు త్వరలోనే కలవబోతున్నారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. త్వరలో బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం కానున్న విషయం విదితమే. ఫిబ్రవరి చివరి వారం నుంచి ఈ షో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ షో ప్రారంభం అవుతుందని నాగార్జున చెప్పేశారు. దీంతో ఈ షోపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
అయితే బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల లిస్ట్ కూడా ఒకటి వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే షో ప్రారంభం సమయంలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు కొందరిని పిలిచి సందడి చేయనున్నారట. వారిలో దీప్తి సునైన, షణ్ముఖ్లు కూడా ఉన్నారు. ఇక ఈ షోను ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రారంభించనున్నారని.. అదే రోజు ఈ మాజీ కంటెస్టెంట్లతో షోను ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇక వేదికపై దీప్తి సునైన, షణ్ముఖ్లు కూడా వస్తారు కనుక.. నిర్వాహకులు అదే వేదికపై ఈ ఇద్దరినీ మళ్లీ కలుపుతారని తెలుస్తోంది. అందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారట. అయితే ఈ విషయంలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. వీరిద్దరూ కలవాలని వీరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి అది నిజం అవుతుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…