Dates and Almond Benefits : ఖర్జూర పండు చాలా విలువైన ఔషధం మరియు శరీరానికి ఒక టానిక్ లా పనిచేస్తుంది. ఖర్జూరం అతి తేలికగా జీర్ణం అయ్యే ఆహారలలో ఒకటి. శరీరానికి కావలిసిన శక్తినివ్వటానికి, శరీరంలోని వ్యర్ధాలను తొలగించటానికి బాగా ఉపయోగపడుతుంది. రోజూ ఖర్జూరాలను తీసుకోవడం ద్వారా ఒక రోజుకు సరిపడా పోషకాహారం శరీరానికి అందిస్తుందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఖర్జూరాల్లో కాపర్, పొటాషియం, ఫైబర్, మాంగనీస్, విటమిన్ బి6, మెగ్నీషియం వంటివి పుష్కలంగా వున్నాయి. ఇందులోని విటమిన్ ఎ ద్వారా కంటి దృష్టి లోపాలను దూరం చేసుకోవచ్చు.
ఖర్జూరాలతో పాటు బాదం పప్పుల్ని పేస్ట్ లా చేసి పాలలో కలుపుకుని మరిగించి తీసుకుంటే నరాల బలహీనతకు సమస్య తగ్గుముఖం పడుతుంది. ఖర్జూరాల్లోని మెగ్నీషియం గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. మహిళలు గర్భధారణ సమయంలో ఖర్జూరాలను తీసుకుంటే ప్రసవానంతరం శరీర బరువు తగ్గేందుకు సహకరిస్తుంది.
అంతేకాకుండా ఖర్జూరాలలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఖర్జూరంలో ఉండే బోరాన్ అనే సమ్మేళనంతోపాటు ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నిషియంలు ఎముకలను దృఢంగా మారుస్తాయి. దీనివల్ల ఎముకలు గుల్లగా మారిపోయే ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఖర్జూరాలలో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో సెరొటోనిన్, నోర్పైన్ఫ్రైన్ అనే హ్యాపీ హార్మోన్లను విడుదల చేస్తుంది. రోజుకి రెండు ఖర్జూరాలను తినడం ద్వారా ఒత్తిడి, డిప్రెషన్, ఇతర మానసిక సమస్యలు తగ్గుతాయి. అంతే కాకుండా మెదడు చురుకుగా పనిచేసి జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
ఖర్జూర పండ్లలోని పొటాషియం గుండెకు రక్తాన్ని సక్రమంగా అందేలా చేస్తుంది. రక్తపోటులో హెచ్చు తగ్గులను నియంత్రించేందుకు ఖర్జూరాలు బాగా ఉపయోగపడతాయి. ఖర్జూరాల్లోని ఐరన్ శరీరంలోని రక్తకణాల సంఖ్యను పెంచుతుంది. రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ ను పెంచి రక్తహీనతను తొలగిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్థులు రోజూకు రెండు ఖర్జూరాలను తీసుకుంటే శరీరానికి పోషకాలు లభించడంతో పాటు బలం చేకూరుతుంది.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…