ఆచార్య తర్వాత చిరంజీవి హీరోగా నటించిన లేెటస్ట్ మూవీ గాడ్ ఫాదర్. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. లూసిఫర్ రీమేక్గా వచ్చిన ఈ సినిమాతో మెగాఫ్యాన్స్ దసరా పండగను మరింత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ చిత్రం విడుదలై అప్పుడే వారం రోజులు గడిచిపోయింది. ఈ వారం రోజుల్లో ఈ సినిమా స్టడీ రన్ ని చూపిస్తూ అద్భుతమైన వసూళ్లను దక్కించుకుంది. 5 రోజుల లాంగ్ వీకెండ్ తర్వాత కూడా ఈ సినిమా సోమవారం రోజు దాదాపుగా కోటి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. మళ్ళీ మంగళవారం రోజు కూడా ఈ సినిమా అదే రేంజ్ వసూళ్లను రాబట్టి స్థిరమైన వసూళ్లను రాబడుతున్న సినిమాగా నిలిచింది.
ఇప్పటి వరుకు ఈ సినిమా ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో చూద్దాం.. ప్రాంతం షేర్ కలెక్షన్స్: నైజం 11.77 కోట్లు, సీడెడ్ 9.00 కోట్లు, ఉత్తరాంధ్ర 5.36 కోట్లు, ఈస్ట్ 3.40 కోట్లు, వెస్ట్ 1.98 కోట్లు, నెల్లూరు 1.90 కోట్లు, గుంటూరు 4.00 కోట్లు, కృష్ణ 2.50 కోట్లు మొత్తం 40.00 కోట్లు. ఓవర్సీస్ 4.60 కోట్లు, కర్ణాటక 4.50 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 5.60 కోట్లు, వరల్డ్ వైడ్ 54.70 కోట్లు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 92 కోట్ల రూపాయలకు జరిగింది. కేవలం నైజం మరియు ఓవర్సీస్ లో మాత్రమే అడ్వాన్స్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం, మిగిలిన చోట్ల కమిషన్ బేసిస్ మీదనే బిజినెస్ ని జరుపుకుంది.
అంటే వచ్చే గ్రాస్ లో 50 శాతం డిస్ట్రిబ్యూటర్స్ కి పోతే మిగిలిన 50 శాతం నిర్మాతకి వెళ్తుంది. ఆ లెక్కన ఈ సినిమా నిర్మాతలకు మరియు బయ్యర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టిన సినిమానే. గాడ్ ఫాదర్ విషయంలో ఓపెనింగ్స్ దగ్గరే సమస్య వచ్చింది. టికెట్ రేట్స్ ఎక్కువగా లేకపోవడంతో పాటుగా లిమిటెడ్ రిలీజ్ కూడా ఉండడం మైనస్ గా మారింది. దసరా రోజు గాడ్ ఫాదర్ తో పాటుగా నాగార్జున ఘోస్ట్ మరియు బెల్లం కొండా గణేష్ స్వాతి ముత్యాలు సినిమాలు విడుదల అయ్యాయి. ఈ 2 సినిమాలు చిరంజీవి సినిమాతో పోటీ పడే స్థాయి లేకపోయినప్పటికీ పెద్ద నిర్మాణ సంస్థల నుండి వచ్చిన సినిమాలు కావడంతో థియేటర్స్ ని బాగా హోల్డ్ చేసారు.
తన వైవాహిక జీవితం ప్రస్తుతం ఎంతో సంతోషకరంగా ఉందని, భర్త మథియాస్ బో తనకు భారంగా అనిపించేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని…
నటుడు అక్షయ్ కుమార్ గతంలో తనకు చెప్పిన మాటలు ఎంతో ప్రేరణగా నిలిచాయని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇటీవల…
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్…
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ ఓడిపోవడం మంచిదేనని, తప్పులను…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఎడి సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న కల్కి 2 చిత్ర షూటింగ్ ఫొటోను బాలీవుడ్…
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…