హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో ప్రారంభమయ్యే నవరాత్రి ఉత్సవాలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజులపాటు దుర్గా దేవికి ప్రత్యేక అలంకరణలు చేసి వివిధ రకాల నైవేద్యాలతో అమ్మవారిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ క్రమంలోనే నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చాలా మంది భక్తులు ఉపవాసాలతో అమ్మవారికి పూజించడం మనం చూస్తూ ఉంటాము.
అయితే నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే వారు ఈ తొమ్మిది రోజుల పాటు ఏ విధమైనటువంటి నియమ నిష్టలతో అమ్మవారిని పూజించాలి, ఏ పనులు చేయకూడదు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
నవరాత్రి ఉత్సవాలు జరుపుకొనేవారు నిత్యం స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించి పూజగదిని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకొని నిత్యం పూజలు చేయాలి. నవరాత్రులలో భాగంగా మొదటి రోజు అమ్మవారిని పూజించేవారు కలశ స్థాపన చేసే సమయంలో సరైన ముహూర్తంలో ఏర్పాటు చేసి అమ్మవారిని పూజించాలి. అదే విధంగా పూజ చేస్తున్నంత సేపు మనసు అమ్మవారిపై ఉంచి పూజించిన అనంతరం అమ్మవారి శ్లోకాలు, మంత్రాలు చదవాలి. ఇక ఉపవాసం ఉన్నవారు కేవలం సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి.
నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మద్యం, మాంసం ముట్టుకోకూడదు. కలశం ముందు ఏర్పాటుచేసిన అఖండ దీపం కొండెక్కకుండా నిత్యం వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా మగవారు నవరాత్రులలో గుండు చేయించుకోకూడదు. ఆడవాళ్లు జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటివి చేయకూడదు. నవరాత్రి పూజ చేసేవారు ఇతరులపై కోపం లేకుండా శాంతియుతంగా ఉండాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…