ప్రతి పురుషుని విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందని కొందరంటే.. ప్రతి స్త్రీ విజయం వెనుక కూడా ఓ పురుషుడు ఉంటాడని కొందరు అంటారు. సరే ఈ విషయం ఎలా ఉన్నా పూజలు, యాగాలు చేసినప్పుడు, దేవాలయాలను సందర్శించినప్పుడు దంపతులిద్దరూ కలిసే ఆ పనులు చేయాలని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. అయితే దీని వెనుక ఉన్న కారణాలేంటో, పురాణాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ పురాణాల ప్రకారం స్త్రీని శక్తితో పోల్చారు. కనుక శక్తి రూపంలో ఉండే స్త్రీ పక్కన ఉండగా పూజ చేస్తే ఆ పురుషునికి అన్నింటా విజయం సిద్దిస్తుందట. అందుకే దంపతులిద్దరూ కలసి పూజలు చేయాలని, దేవాలయాలను దర్శించాలని చెబుతారు. దంపతులిద్దరూ ఒకరి శరీరంలో మరొకరు సగభాగం అంటారు. అందుకు పరమశివున్ని అర్థనారీశ్వరుని రూపంలో కొలుస్తారు. ఈ క్రమంలో వారు కష్ట సుఖాల్లోనూ కాదు, పూజలు చేసినప్పుడు, ఆలయాల వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు కలిసే ఆ పనులు చేస్తే దాంతో ఆ ఫలితం ఇద్దరికీ కలుగుతుందట.
కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో చాలా మంది రాజులు తమ భార్యలు పక్కన లేనప్పుడు వారికి చెందిన బంగారు విగ్రహాలతో పూజలు చేసే వారు కదా. అలాగే ఇప్పుడు కూడా భార్యాభర్తలిద్దరూ చేయాలట. దాంతో ఆ యాగ ఫలితం సంపూర్ణంగా వారికి దక్కుతుందట. పెళ్లి చేసుకున్నప్పుడు దంపతులిద్దరూ అన్ని విషయాల్లోనూ ఇద్దరూ సమంగా పాలు పంచుకుంటామని పంచ భూతాల సాక్షిగా ప్రమాణం చేస్తారు కదా. మరి అలాంటప్పుడు పుణ్యక్షేత్రాల సందర్శన, పూజలు చేసినప్పుడు కూడా భార్యభర్తలిద్దరూ పాల్గొంటేనే అది పరిపూర్ణం అయి ఫలితం దక్కుతుంది. లేదంటే సగం ఫలమే దక్కుతుంది.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…