Akhanda Movie : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో వస్తున్న మరో సినిమా.. అఖండ. ఈ మూవీకి గాను ఇప్పటికే విడుదల చేసిన టీజర్స్, పోస్టర్స్, పాటలు ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలను పెంచాయి. ఈ క్రమంలో ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. డిసెంబర్ 2న ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అఖండ మూవీకి షాక్ ఇచ్చినట్లయింది. దీంతో ఈ మూవీ చిక్కుల్లో పడిపోయింది.
ఏపీ ప్రభుత్వం ఇటీవలే సంచలన నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. టిక్కెట్ల రేట్లను తగ్గించడంతోపాటు అన్నింటినీ ఆన్లైన్లోనే విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు బెనిఫిట్ షోలు, ఎక్స్ ట్రా షోలను రద్దు చేశారు. ఇలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ను ఇబ్బందుల్లోకి నెట్టివేసింది. అసలే కరోనా వల్ల టాలీవుడ్ పరిశ్రమ తీవ్ర నష్టాల్లో ఉంది. దీంతో ఏపీ ప్రభుత్వం నిర్ణయం వల్ల మరో ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది. ఈ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రానున్న కాలంలో విడుదలయ్యే ఏ సినిమా కూడా వసూళ్లను సాధించలేదని అంటున్నారు.
కరోనా నేపథ్యంలో గత 2 సంవత్సరాల నుంచి అన్ని చిత్ర పరిశ్రమలు నష్టాల్లోనే ఉన్నాయి. దేశంలో ఎక్కడా సినిమాలకు లాభాలు రావడం లేదు. కనీసం షో లు నడిస్తే చాలనే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పుండు మీద కారం చల్లినట్లు అయింది. టిక్కెట్లను గరిష్టంగా రూ.240కి మాత్రమే అమ్ముకునే వెసులు బాటు ఉంది. అది కూడా మల్టీప్లెక్స్లలోనే. ఇలా ధరలు ఉంటే ఏ సినిమాకు కూడా లాభాలు రావని విశ్లేషకులు అంటున్నారు. ఈ మధ్యే ఏపీ ప్రభుత్వం బిల్లును కూడా పాస్ చేసింది. దీంతో సినిమాలకు గడ్డు కాలం వచ్చిందని అంటున్నారు.
ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మొదటగా బాలకృష్ణనే చిక్కుల్లో పడ్డారు. అఖండ మూవీని బాలకృష్ణ ఎంతో ఇష్టంగా పూర్తి చేశారట. ఈ క్రమంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా మూవీని విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే మూవీ హిట్ టాక్ వచ్చినా.. ఏపీలో టిక్కెట్ల రేట్లు తక్కువగా ఉండడం, ప్రత్యేక షోలు లేని కారణంగా.. అక్కడ నష్టాలే వస్తాయని అంటున్నారు. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, థియేటర్ల ఓనర్లు పూర్తిగా నష్టపోతామని అంటున్నారు. కోవిడ్ రెండో దశ అనంతరం అనేక చిత్రాలు ఓటీటీల్లోనే విడుదలయ్యాయి. ఇక బాలయ్య అఖండతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరి ఏపీ ప్రభుత్వం నిర్ణయం అఖండ మూవీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూస్తే తెలుస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…