CM KCR Yadadri : యాదాద్రి ఆలయం ఎప్పటి నుంచి పునః ప్రారంభమవుతుందోనని ఎంతగానో ఎదురు చూస్తున్న భక్తులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఆలయాన్ని వచ్చే ఏడాది మార్చి 28వ తేదీన ప్రారంభించనున్నట్లు తెలిపారు. అయితే అంతకు వారం రోజుల ముందు 8 రోజుల పాటు మహా సుదర్శన యాగం ఉంటుందన్నారు. ఈ క్రమంలో 10వేల మంది రుత్విక్కులతో మహా సుదర్శన హోమం నిర్వహిస్తామని తెలిపారు.
కాగా మార్చి 28, 2022వ తేదీన మహా కుంభ సంప్రోక్షణ ఉంటుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ మంగళవారం యాదాద్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాగా ఆలయ పునఃప్రారంభ ఆహ్వాన పత్రికను త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి తన స్వదస్తూరితో రాసి ఇచ్చారు. దీంతో పత్రికను స్వామి వారి పాదాల చెంత ఉంచాలని కేసీఆర్.. ఈవోకు అందజేశారు.
ఇక ఆలయ విమాన గోపురానికి 125 కిలోల బంగారంతో తాపడం చేయాల్సి ఉంటుందని తెలిపారు. అందుకు అవసరమైన బంగారంలో కొంత మేర విరాళంగా వస్తుందని, మిగిలిన భాగాన్ని ఆర్బీఐ నుంచి కొనుగోలు చేస్తామని తెలిపారు. తన కుటుంబం నుంచి 1 కిలో 16 తులాలకు పైగా బంగారాన్ని విరాళంగా సమకూరుస్తామని ప్రకటించారు. అలాగే మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కావేరీ సీడ్స్ నుంచి బంగారాన్ని విరాళంగా అందిస్తారని తెలిపారు.
మంగళవారం ఉదయం నుంచి సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనలోనే ఉన్నారు. ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఆలయ పనులను పరిశీలించారు. ఈ క్రమంలోనే ఆయన గండి చెరువు, పుష్కరిణి, కల్యాణ కట్ట, దీక్షాపరుల మంటపం, సత్యనారాయణ మంటపం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్లు, గర్భాల ద్వారాలు తదితర నిర్మాణాలను పరిశీలించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…