Chiranjeevi : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లాలో గత రెండు రోజులుగా అతిభారీ వర్షాలు కురిశాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుమల గిరుల్లో కుంభ వృష్టి కురుస్తుండటంతో.. భక్తులు, తిరుపతి వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకు ముందు కురిసిన వర్షాలకే తిరుపతి వాసుల పరిస్థితి దయనీయంగా మారింది.
ఇప్పటి వర్షాలకు చిత్తూరు జిల్లా మొత్తం వరదలతో అతలాకుతలం అవుతోంది. తిరుపతిలోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. తిరుచానూరులోని వసుంధర నగర్లో ఓ ఇల్లు స్వర్ణముఖి నది ప్రవాహంలో కొట్టుకుపోవడంతో.. ఇంటి యజమాని, ఇతర కుటుంబ సభ్యులు భోరున విలపించారు. తిరుపతిలో భారీ వర్షాల కారణంగా.. రోడ్లు.. నదులను తలపిస్తున్నాయి.
వరద ప్రవాహ తీవ్రత కారణంగా.. ఆటోలు, బైకులు కొట్టుకుపోయాయి. గార్గేయి నది ఉగ్ర రూపం దాల్చడంతో.. చిత్తూరు జిల్లా సదుం సమీపంలో పశువులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఈ పరిస్థితులు ప్రతి ఒక్కరినీ తీవ్ర ఆందోళనలకు గురి చేస్తున్నాయి.
దీనిపై తాజాగా స్పందించిన చిరంజీవి.. గతంలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమల, తిరుపతిలో భక్తులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనసులని కలిచివేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీలు కలసికట్టుగా కృషి చేసి సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులని నెలకొల్పాలి. అన్ని రాజకీయ పక్షాలు, అలాగే అభిమాన సంఘాలు సైతం చేయూతనివ్వాల్సిందిగా కోరుతున్నాను.. అని చిరు తన ట్వీట్లో పేర్కొన్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…