Chiranjeevi : మెగాస్టార్ చికంజీవి ఈమధ్యే ఆచార్య సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. అయితే ఈ మూవీ అనుకున్న ఫలితాన్ని అందించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ నిరాశ పరిచింది. ఈ క్రమంలోనే చిరంజీవి తన తదుపరి చిత్రం గాడ్ ఫాదర్పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీని దసరాకు రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే కాకుండా భోళా శంకర్, వాల్తేరు వీరయ్య మూవీలు కూడా లైన్లో ఉన్నాయి. అయితే ఈ సినిమాలు ఇంకా పూర్తి కానేలేదు.. చిరంజీవి ఇంకో సినిమాను లైన్లో పెడుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా తమిళ దర్శకుడితో సినిమా కావడం విశేషం.
ఇటీవలే చిరంజీవిని కమలహాసన్, లోకేష్ కనగరాజ్లు కలిసిన విషయం విదితమే. కమలహాసన్ నటించిన విక్రమ్ చిత్రానికి లోకేష్ దర్శకుడు. ఈ క్రమంలోనే హైదరాబాద్కు వచ్చిన వీరిని చిరంజీవి సన్మానించారు. వీరికి తన ఇంట్లోనే చిరు విందు ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా దర్శకుడు లోకేష్ను మూవీ గురించి చిరంజీవి అడిగారట. గతంలో లోకేష్ ప్రభాస్కు ఓ స్టోరీ చెప్పారట. కానీ ప్రభాస్ ఆ స్టోరీని రిజెక్ట్ చేశారట. అయితే దానికి చిరంజీవి కొన్ని మార్పులు సూచించారట. ఆ మార్పులకు ఓకే అయితే తాను లేదా చరణ్ ఆ సినిమా చేసేందుకు సిద్ధమని చిరు.. లోకేష్తో అన్నారట. దీంతో లోకేష్ అంగీకరించినట్లు కూడా తెలుస్తోంది.
అయితే ప్రభాస్ రిజెక్ట్ చేసిన స్టోరీతో చిరంజీవి సినిమా తీస్తారా.. లేక ఆయన తనయుడు చరణ్కు ఆ సినిమాను అప్పగిస్తారా.. అన్న విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. ఇక ప్రస్తుతం చిరంజీవితోపాటు దర్శకుడు లోకేష్ కూడా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కనుక ఒక వేళ చిరంజీవితోనే సినిమా చేయాలన్నా.. కనీసం ఈ ఇద్దరూ ఇంకో ఏడాది వరకు ఆగక తప్పదు. వచ్చే ఏడాది ఇదే సమయం వరకు వీరు ముహుర్తం కుదిరితే సినిమా చేసే అవకాశం ఉంది. లేదా చరణ్కు చిరంజీవి ఈ మూవీని అప్పగించవచ్చు. మరి ఇద్దరిలో ఈ మూవీలో ఎవరు నటిస్తారో.. వేచి చూస్తే తెలుస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…