Chiranjeevi : మెగాస్టార్ చికంజీవి ఈమధ్యే ఆచార్య సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. అయితే ఈ మూవీ అనుకున్న ఫలితాన్ని అందించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ నిరాశ పరిచింది. ఈ క్రమంలోనే చిరంజీవి తన తదుపరి చిత్రం గాడ్ ఫాదర్పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీని దసరాకు రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే కాకుండా భోళా శంకర్, వాల్తేరు వీరయ్య మూవీలు కూడా లైన్లో ఉన్నాయి. అయితే ఈ సినిమాలు ఇంకా పూర్తి కానేలేదు.. చిరంజీవి ఇంకో సినిమాను లైన్లో పెడుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా తమిళ దర్శకుడితో సినిమా కావడం విశేషం.
ఇటీవలే చిరంజీవిని కమలహాసన్, లోకేష్ కనగరాజ్లు కలిసిన విషయం విదితమే. కమలహాసన్ నటించిన విక్రమ్ చిత్రానికి లోకేష్ దర్శకుడు. ఈ క్రమంలోనే హైదరాబాద్కు వచ్చిన వీరిని చిరంజీవి సన్మానించారు. వీరికి తన ఇంట్లోనే చిరు విందు ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా దర్శకుడు లోకేష్ను మూవీ గురించి చిరంజీవి అడిగారట. గతంలో లోకేష్ ప్రభాస్కు ఓ స్టోరీ చెప్పారట. కానీ ప్రభాస్ ఆ స్టోరీని రిజెక్ట్ చేశారట. అయితే దానికి చిరంజీవి కొన్ని మార్పులు సూచించారట. ఆ మార్పులకు ఓకే అయితే తాను లేదా చరణ్ ఆ సినిమా చేసేందుకు సిద్ధమని చిరు.. లోకేష్తో అన్నారట. దీంతో లోకేష్ అంగీకరించినట్లు కూడా తెలుస్తోంది.
అయితే ప్రభాస్ రిజెక్ట్ చేసిన స్టోరీతో చిరంజీవి సినిమా తీస్తారా.. లేక ఆయన తనయుడు చరణ్కు ఆ సినిమాను అప్పగిస్తారా.. అన్న విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. ఇక ప్రస్తుతం చిరంజీవితోపాటు దర్శకుడు లోకేష్ కూడా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కనుక ఒక వేళ చిరంజీవితోనే సినిమా చేయాలన్నా.. కనీసం ఈ ఇద్దరూ ఇంకో ఏడాది వరకు ఆగక తప్పదు. వచ్చే ఏడాది ఇదే సమయం వరకు వీరు ముహుర్తం కుదిరితే సినిమా చేసే అవకాశం ఉంది. లేదా చరణ్కు చిరంజీవి ఈ మూవీని అప్పగించవచ్చు. మరి ఇద్దరిలో ఈ మూవీలో ఎవరు నటిస్తారో.. వేచి చూస్తే తెలుస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…