Chiranjeevi : మెగాస్టార్ చికంజీవి ఈమధ్యే ఆచార్య సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. అయితే ఈ మూవీ అనుకున్న ఫలితాన్ని అందించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ నిరాశ పరిచింది. ఈ క్రమంలోనే చిరంజీవి తన తదుపరి చిత్రం గాడ్ ఫాదర్పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీని దసరాకు రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే కాకుండా భోళా శంకర్, వాల్తేరు వీరయ్య మూవీలు కూడా లైన్లో ఉన్నాయి. అయితే ఈ సినిమాలు ఇంకా పూర్తి కానేలేదు.. చిరంజీవి ఇంకో సినిమాను లైన్లో పెడుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా తమిళ దర్శకుడితో సినిమా కావడం విశేషం.
ఇటీవలే చిరంజీవిని కమలహాసన్, లోకేష్ కనగరాజ్లు కలిసిన విషయం విదితమే. కమలహాసన్ నటించిన విక్రమ్ చిత్రానికి లోకేష్ దర్శకుడు. ఈ క్రమంలోనే హైదరాబాద్కు వచ్చిన వీరిని చిరంజీవి సన్మానించారు. వీరికి తన ఇంట్లోనే చిరు విందు ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా దర్శకుడు లోకేష్ను మూవీ గురించి చిరంజీవి అడిగారట. గతంలో లోకేష్ ప్రభాస్కు ఓ స్టోరీ చెప్పారట. కానీ ప్రభాస్ ఆ స్టోరీని రిజెక్ట్ చేశారట. అయితే దానికి చిరంజీవి కొన్ని మార్పులు సూచించారట. ఆ మార్పులకు ఓకే అయితే తాను లేదా చరణ్ ఆ సినిమా చేసేందుకు సిద్ధమని చిరు.. లోకేష్తో అన్నారట. దీంతో లోకేష్ అంగీకరించినట్లు కూడా తెలుస్తోంది.
అయితే ప్రభాస్ రిజెక్ట్ చేసిన స్టోరీతో చిరంజీవి సినిమా తీస్తారా.. లేక ఆయన తనయుడు చరణ్కు ఆ సినిమాను అప్పగిస్తారా.. అన్న విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. ఇక ప్రస్తుతం చిరంజీవితోపాటు దర్శకుడు లోకేష్ కూడా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కనుక ఒక వేళ చిరంజీవితోనే సినిమా చేయాలన్నా.. కనీసం ఈ ఇద్దరూ ఇంకో ఏడాది వరకు ఆగక తప్పదు. వచ్చే ఏడాది ఇదే సమయం వరకు వీరు ముహుర్తం కుదిరితే సినిమా చేసే అవకాశం ఉంది. లేదా చరణ్కు చిరంజీవి ఈ మూవీని అప్పగించవచ్చు. మరి ఇద్దరిలో ఈ మూవీలో ఎవరు నటిస్తారో.. వేచి చూస్తే తెలుస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…