Chiranjeevi Godfather : 1990లలో ఎన్నో సినిమాలతో ప్రేక్షకులని ఫుల్గా ఎంటర్టైన్ చేసిన చిరంజీవి మధ్యలో గ్యాప్ తీసుకున్నారు. ఖైదీ నం.150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ఇప్పుడు కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా కంప్లీట్ చేసిన చిరు, ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో ముఖ్యపాత్రలో నటించారు.
ప్రస్తుతం ’గాడ్ ఫాదర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ మూవీకి రీమేక్గా తెరకెక్కుతోంది. ‘గాడ్ ఫాదర్’ మూవీని ఆర్.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ సూపర్ గుడ్ ఫిల్మ్స్తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.
చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ రీమేక్ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ పనిచేస్తున్నారు. ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చిరంజీవి సరసన ‘అల్లుడా మజాకా’, ‘ముగ్గురు మొనగాళ్లు’, ‘ఇద్దరు మిత్రులు’ తదితర చిత్రాలలో కథానాయికగా నటించిన రమ్యకృష్ణ ఇప్పుడు ఆయనకు చెల్లెలుగా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో చిరు చెల్లెలు పాత్రకు ప్రాధాన్యం ఉంది.
ఆ పాత్ర కోసం రమ్యకృష్ణని ఎంచుకున్నారని సమాచారం. రమ్య కూడా ఈ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అతిథి పాత్రలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…