Chiranjeevi : బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనసూయపై మెగాస్టార్ చిరంజీవి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి తనకు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలు అనసూయకు మెగాస్టార్ వార్నింగ్ ఇవ్వడం ఏంటి ? ఇలా తనకి వార్నింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి.. అనే విషయానికి వస్తే..
మెగాస్టార్ చిరంజీవి మళయాళంలో వచ్చిన లూసిఫర్ చిత్రానికి రీమేక్ చిత్రంగా గాడ్ ఫాదర్ చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో అనసూయ కూడా కీలక పాత్రల్లో నటిస్తోంది. ఇందులో అనసూయ ఒక న్యూస్ ఛానల్ నడుపుతూ ఉంటుంది. ఆర్థిక సమస్యలలో చిక్కుకున్న అనసూయకు చిరంజీవి ప్రత్యర్థులు తన న్యూస్ ఛానల్ లో చిరంజీవి గురించి చెడుగా ప్రచారం చేస్తే తనని ఆదుకుంటామని చెబుతారు. తన ఛానల్ నడవడం కోసం అనసూయ.. చిరంజీవి పై దుష్ప్రచారం చేస్తుంది.
ఈ దుష్ప్రచారం కారణంగా చిరంజీవి ఏకంగా జైలుకు కూడా వెళ్తారు. కానీ చిరంజీవి ప్రత్యర్థులు మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా అనసూయని కూడా మోసం చేస్తారు. అయితే జైలు నుంచి బయటకువచ్చిన తర్వాత చిరంజీవి అనసూయకి ఉన్న ఆర్థిక కష్టాలను తీర్చడమే కాకుండా ఆ సమయంలో ఆమెకు గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తారు. ఇలా ఈ సినిమాలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి అనసూయకు వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోహన్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…