Gharana Mogudu : ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలైంది. పాత హిట్ సినిమాలకి రీ రిలీజ్ పేరుతో స్పెషల్ షోలు వేయడం, అదే విధంగా తమ హీరో సినిమా కూడా ప్రదర్శించాలని అభిమానులు డిమాండ్ చేయడం జరుగుతోంది. ఇక ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా వేసిన పోకిరి సినిమా స్పెషల్ షోలు బాగా విజయవంతం అవడంతో ఈ ట్రెండ్ ఊపందుకుంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జల్సా మూవీకి కూడా ఆయన పుట్టిన తేదీ అయిన సెప్టెంబర్ 2న స్పెషల్ షోలు వేయనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి జన్మదినం కావడంతో ఒకప్పుడు ఆయన హీరోగా నటించి అదిరిపోయే విజయం సాధించిన ఘరానా మొగుడు సినిమాని కూడా రీ రిలీజ్ చేయడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ఒకవేళ అలా గానీ జరిగితే ఈ రెండు తేదీల్లో థియేటర్లు మెగా అభిమానుల సంబరాలతో మోత మోగిపోవడం ఖాయం అని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఇక ఘరానా మొగుడు సినిమాకు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నగ్మా, వాణీ విశ్వనాథ్ హీరోయిన్లుగా నటించారు. 1992 ఏప్రిల్ 9న విడుదలైన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే.
తెలుగు సినీ పరిశ్రమ సరైన విజయాలు లేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఒక విధంగా ఇది మంచి పరిణామం అనే చెప్పవచ్చు. ఇలాగైనా ప్రేక్షకులు థియేటర్లకి దగ్గరవుతారని ఆశిస్తున్నారు. అయితే ఇండస్ట్రీకి ఇది ఏవిధంగా ఉపయోగపడుతుందో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…