Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారమే రేగింది. హైదరాబాద్లో బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవి ఫోటో సెషన్ ఆపేసి రాకపోతే నేనే వెళ్లిపోతా అని అసహనం వ్యక్తం చేశారనే అంశం వివాదానానికి దారి తీసింది. దీంతో మొన్నటి నుంచి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రచ్చ జరుగుతుంది. అయితే అక్కడ ఆ సంఘటన జరిగిన తర్వాత ఏం జరిగింది అనేది ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. గరికపాటి అన్న మాటలను సెపరేట్ చేసి.. చిరంజీవి అన్న మాటలను వేరు చేసి వీడియోను వైరల్ చేస్తున్నారు.
అదే నిజమని అంతా అనుకున్నారు.. అస్సలు ఆ తరువాత గరికపాటి చిరంజీవికి ఎంత గౌరవం ఇచ్చారు అనేది కూడా చూడాలి.. అసలు ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని అక్కడే ఉన్న ఓ జర్నలిస్ట్ ట్వీట్ చేశాడు. మొన్నటి అలయ్ – బలయ్ కార్యక్రమంలో వాస్తవానికి చిరంజీవి తప్పు ఏమీ లేదు.. ఆ కార్యక్రమం నిర్వహిస్తున్న బండారు దత్తాత్రేయ కుటుంబ సభ్యులు చిరంజీవితో ఫోటో దిగడానికి మెగాస్టార్ ను వేదికకు ఒక పక్కకు పిలిచారు. దత్తాత్రేయ కుటుంబ సభ్యులు గ్రూపులుగా వచ్చి ఫోటో దిగుతున్నారు.. ఈలోపు సభ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న చింతల రామచంద్రారెడ్డి గరికపాటి నరసింహారావును మాట్లాడవలసిందిగా కోరారు.
ఇది ఫోటోలు దిగుతున్న చిరంజీవికి వినిపించలేదు. చిరంజీవి ఫోటోలు దిగుతుంది దత్తాత్రేయ కుటుంబ సభ్యులతో అని గరికపాటికి తెలియక అభిమానులతో ఫోటో దిగుతున్నారని ఆయన చిరాకు ప్రదర్శించారు. గరికపాటికి ఇది తెలిసి చిరంజీవి వద్దకు వచ్చి ఏదో చెప్పారు.. ఆ తర్వాత తన పక్కన కూర్చోవాల్సిందిగా గరికపాటి చిరంజీవిని కోరారు. వెంటనే చిరంజీవి కుర్చీ తెప్పించుకొని ఆయన పక్కనే కూర్చున్నారు. ఇదే వేదికపై జరిగిన అసలు కథ. ఆ తరువాత గరికపాటి, చిరంజీవి చాలా సన్నిహితంగా ఉన్నారని.. ఆ ఫంక్షన్ అయ్యాక ఇద్దరూ కలిసి కాసేపు పర్సనల్ గా మాట్లాడుకున్నారని.. ఆ జర్నలిస్ట్ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు. అయితే వివాదం ఇంతటితో ముగుస్తుందా.. లేదా.. అన్నది చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…