Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారమే రేగింది. హైదరాబాద్లో బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవి ఫోటో సెషన్ ఆపేసి రాకపోతే నేనే వెళ్లిపోతా అని అసహనం వ్యక్తం చేశారనే అంశం వివాదానానికి దారి తీసింది. దీంతో మొన్నటి నుంచి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రచ్చ జరుగుతుంది. అయితే అక్కడ ఆ సంఘటన జరిగిన తర్వాత ఏం జరిగింది అనేది ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. గరికపాటి అన్న మాటలను సెపరేట్ చేసి.. చిరంజీవి అన్న మాటలను వేరు చేసి వీడియోను వైరల్ చేస్తున్నారు.
అదే నిజమని అంతా అనుకున్నారు.. అస్సలు ఆ తరువాత గరికపాటి చిరంజీవికి ఎంత గౌరవం ఇచ్చారు అనేది కూడా చూడాలి.. అసలు ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని అక్కడే ఉన్న ఓ జర్నలిస్ట్ ట్వీట్ చేశాడు. మొన్నటి అలయ్ – బలయ్ కార్యక్రమంలో వాస్తవానికి చిరంజీవి తప్పు ఏమీ లేదు.. ఆ కార్యక్రమం నిర్వహిస్తున్న బండారు దత్తాత్రేయ కుటుంబ సభ్యులు చిరంజీవితో ఫోటో దిగడానికి మెగాస్టార్ ను వేదికకు ఒక పక్కకు పిలిచారు. దత్తాత్రేయ కుటుంబ సభ్యులు గ్రూపులుగా వచ్చి ఫోటో దిగుతున్నారు.. ఈలోపు సభ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న చింతల రామచంద్రారెడ్డి గరికపాటి నరసింహారావును మాట్లాడవలసిందిగా కోరారు.
ఇది ఫోటోలు దిగుతున్న చిరంజీవికి వినిపించలేదు. చిరంజీవి ఫోటోలు దిగుతుంది దత్తాత్రేయ కుటుంబ సభ్యులతో అని గరికపాటికి తెలియక అభిమానులతో ఫోటో దిగుతున్నారని ఆయన చిరాకు ప్రదర్శించారు. గరికపాటికి ఇది తెలిసి చిరంజీవి వద్దకు వచ్చి ఏదో చెప్పారు.. ఆ తర్వాత తన పక్కన కూర్చోవాల్సిందిగా గరికపాటి చిరంజీవిని కోరారు. వెంటనే చిరంజీవి కుర్చీ తెప్పించుకొని ఆయన పక్కనే కూర్చున్నారు. ఇదే వేదికపై జరిగిన అసలు కథ. ఆ తరువాత గరికపాటి, చిరంజీవి చాలా సన్నిహితంగా ఉన్నారని.. ఆ ఫంక్షన్ అయ్యాక ఇద్దరూ కలిసి కాసేపు పర్సనల్ గా మాట్లాడుకున్నారని.. ఆ జర్నలిస్ట్ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు. అయితే వివాదం ఇంతటితో ముగుస్తుందా.. లేదా.. అన్నది చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…