Chandrababu Naidu : తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో తొలిసారిగా లైవ్లోనే ఏడ్చేశారు. ఆయన అలా ఏడవడం అందరినీ షాక్కు గురి చేసింది. ఏపీ అసెంబ్లీ సమావేశాల నుంచి ఆయన వాకౌట్ చేసిన అనంతరం.. తిరిగి ఏపీకి సీఎం అయ్యాకే.. మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతానని అన్నారు. వెంటనే ఆయన మంగళగిరిలో టీడీపీ ఆఫీస్కి చేరుకుని అక్కడ మీడియా సమావేశం నిర్వహించారు. అందులో భాగంగానే ఆయన లైవ్లోనే ఏడ్చేశారు.
కాగా ఇటీవల నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి పాలైన విషయం విదితమే. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ ఓటమి పాలైంది. దీంతో అసెంబ్లీలో తనను అధికార పార్టీ వైసీపీ నేతలు, ముఖ్యమంత్రి జగన్ అనరాని మాటలు అన్నారని, తీవ్ర పదజాలంతో దూషించారని.. చివరకు తన భార్య భువనేశ్వరిని కూడా ఈ విషయంలోకి తీసుకొచ్చారని.. చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఆయన ప్రెస్ మీట్ సందర్భంగా మాట్లాడుతూనే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒకానొక దశలో భావాలను నియంత్రించుకోలేకపోయారు. లైవ్లోనే ఏడ్చేశారు. గతంలో ఆయన ఎప్పుడు మీడియా సమావేశం పెట్టినా వైసీపీపై నిప్పులు చెరిగేవారు. అలాంటిది ఇప్పుడు ఆయన ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుని ఒక నిమిషం పాటు ఏడ్చారు. ఇక ఆయన పక్కన ఉన్న టీడీపీ నేతలు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.
చంద్రబాబు తరువాత తన దుఃఖాన్ని నియంత్రించుకుని మాట్లాడారు. తన భార్య ఎల్లప్పుడూ రాజకీయాల్లో లేరని అన్నారు. అయినప్పటికీ ఆమె తన ప్రతి విజయం వెనుక ఉన్నారని తెలిపారు. వైసీపీ నేతలు తనను అసభ్య పదజాలంతో దూషించారని.. తీవ్రంగా వేధింపులకు గురి చేశారని.. బాబు అన్నారు.
తనకు అధికారం అంటే ఆసక్తి లేదని.. తాను ఇప్పటికే ఎన్నో చూశానని.. రాష్ట్రానికి తాను రికార్డు స్థాయిలో సీఎంగా ఉన్నానని అన్నారు. తనకు రికార్డులు అవసరం లేదన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న నియంతృత్వ పాలనపై తాను పోరాటం చేస్తానని అన్నారు. ప్రజల కోసం ముందుకు సాగుతానని అన్నారు. తాను రాజకీయాల్లోకి మళ్లీ వస్తానని తెలిపారు.
ఇక ప్రెస్ మీట్ చివర్లో కూడా చంద్రబాబు మళ్లీ ఏడ్చారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు మాత్రం ఆయన సమాధానాలు చెప్పకుండానే వెళ్లిపోయారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…