Nandivardhanam Plant : మనం ఎన్నో రకాల పూల మొక్కలను పెరట్లో పెంచుకుంటాం. కొన్ని రకాల మొక్కలు పూలు పూయడమే కాకుండా ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటాయని చెప్పవచ్చు. ఇలా ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్కల్లో 5 రెక్కల నందివర్ధనం మొక్క కూడా ఒకటి. దీనినే గరుడవర్ధనం అని కూడా అంటారు. ఈ మొక్క పూలు చాలా అందంగా ఉంటాయి. ఈ పూలను ఎక్కువగా దైవరాధనకి ఉపయోగిస్తాం. మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు.
ఈ నందివర్ధనం పూలు ఎక్కువగా వర్షాకాలం మరియు వేసవి కాలంలో పూస్తాయి. శీతాకాలంలో ఈ పువ్వులు చాలా తక్కువగా పూస్తాయి. వర్ష మరియు శీతాకాలంలో చాలా మంది కఫ, పైత్య దోషాలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. నందివర్ధనం కఫాన్ని, పైత్యాన్ని, కడుపులో మంటలను, రక్తదోషాలను, జ్వరాన్ని, వాంతులను, మగతను వంటి విష ప్రభావాలను తగ్గిస్తుంది. నందివర్ధనం మొక్కలో యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలను కలిగి ఉండటం వలన ఈ మొక్క యొక్క ఆకుల రసాన్ని గాయాలకు పై పూతగా రాస్తే తొందరగా నయం అవుతాయి.
అంతేకాకుండా నందివర్ధనం పూల రసంలో కర్పూరం వేసి బాగా కలిపి ఆ మిశ్రమం నుంచి ఒక చుక్కను కంటిలో వేసుకుంటే కంటి మంటలు, కన్ను ఎర్రబడటం వంటివి తగ్గిస్తుంది. అలాగే తాజా నందివర్ధనం పువ్వులను కళ్లపై పెట్టుకుంటే కంటి ఎరుపుదనం తగ్గించి కంటికి చల్లదనాన్ని కలిగిస్తుంది. నందివర్ధనం మొక్క ఆకులు, కాండం, వేళ్ళు, పువ్వులు అన్నింటిలోనూ ఔషద గుణాలు అధికంగా ఉంటాయి.
తలనొప్పిగా ఉన్నవారు ఈ ఆకుల రసాన్ని నుదురుకి రాస్తే తొందరగా తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ నందివర్ధనం పువ్వులను రాత్రంతా నీటిలో వేసి ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటితో కళ్లను శుభ్రం చేసుకుంటే కంటి సమస్యలు తగ్గుతాయి. ఈ నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో త్రాగితే కిడ్నీ సమస్యలు, యూరినరీ ఇన్ఫెక్షన్ లు తగ్గుముఖం పడతాయి. ఇలా నందివర్ధనం మొక్కతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నయి కనుక దీన్ని అందరూ ఇంట్లో పెంచుకోవాలి. దీంతో ఎన్నో లాభాలను పొందవచ్చు.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…