Brahmanandam : నందమూరి నటసింహం బాలకృష్ణ ఆహా వేదికగా అన్స్టాపుబల్ విత్ ఎన్బీకే అనే టాక్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి ఎపిసోడ్ లో భాగంగా మోహన్ బాబు, రెండవ ఎపిసోడ్ లో నాని ప్రేక్షకులను సందడి చేశారు. అయితే మూడవ వారం విజయ్ దేవరకొండ వస్తున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపించినప్పటికీ ఈ కార్యక్రమం ఆగిపోయింది.
బాలకృష్ణ భుజానికి సర్జరీ కావడం వల్ల కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి తరువాత రానున్న అతిథుల గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఈ షోతో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు రాగా, తాజాగా ఈ కార్యక్రమానికి కమెడియన్ బ్రహ్మానందం కూడా రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
ఇదివరకే బ్రహ్మానందం.. అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆలీతో సరదాగా షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో బ్రహ్మానందాన్ని బాలకృష్ణ షో కు కూడా అతిథిగా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…