Brahmaji : ఇటీవల సీనియర్ స్టార్ యాంకర్, నటి అనసూయని ట్విట్టర్ లో కొందరు నెటిజన్లు ఆంటీ అని పిలిచినందుకు కేసు వేస్తానని చెప్పడం హాట్ టాపిక్ అయింది. దీనిపై చాలా మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. రెండు రోజులు ఆంటీ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. ఆంటీ అని పిలిస్తే వేధించినట్లేనని అనసూయ చెప్పడంతో నెటిజన్లు మరింత రెచ్చిపోయి ట్వీట్లు వేశారు. ఎంతమందిపై అని కేసులు వేస్తావు అంటూ సెటైర్లు వేశారు. అయితే ఇప్పుడు నటుడు బ్రహ్మాజీ ఈ టాపిక్ పై పరోక్షంగా ఓ జోక్ చేశారు. తాజాగా ట్విట్టర్ లో ఆయన ఒక ఫొటోని షేర్ చేసి.. ఏం జరుగుతోంది..? అని ట్వీట్ వేశారు.
దానికి ఓ నెటిజన్ ఏం లేదు అంకుల్ అని బదులిచ్చాడు. అది చూసిన బ్రహ్మాజీ అంకుల్ ఏంట్రా అంకుల్.. కేసు వేస్తా.. ఏజ్.. బాడీ షేమింగా..? అంటూ ఫన్నీ ఎమోజీతో రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు మరింత ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఎన్ని కేసులు వేస్తానని చెప్పినా, ఫలానా ఆంటీ గారికి వచ్చినంత అటెన్షన్ మాత్రం మీకు రాదు బ్రహ్మాజీ గారు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ఇప్పుడు మీరు కూడా స్టార్ట్ చేశారా..? అయితే ఎన్ని కేసులు పెడతారు సార్..? అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఇలా ఈ కామెంట్ల పరంపర కొనసాగుతూనే ఉంది.
విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో.. పరోక్షంగా ప్రస్తావిస్తూ అనసూయ చేసిన ట్వీట్ తోనే ఈ రచ్చ మొదలైందని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో విజయ్ ఫ్యాన్స్ ఆమెను ఎటాక్ చేయడం మొదలుపెట్టారు. ఆమెను ఆంటీ.. ఆంటీ.. అని పచ్చి బూతులు తిడుతూ ట్వీట్లు చేయడంతో అనసూయ దారుణంగా ట్రోలింగ్కి గురైంది. దీంతో అనసూయ కూడా తగ్గేదే లే అన్నట్టుగా.. తనని ట్రోల్ చేసేవారికి కౌంటర్లు ఇస్తూ వచ్చింది. దీంతో ట్రోలర్స్ వెనక్కి తగ్గకుండా ఆమెను ఆంటీ అంటూ రెట్టింపు ట్రోలింగ్ చేశారు. అనసూయ వెనుక ఎవరో ఉండి ఉంటారు లేకపోతే ఇంత చేయదు అని ఓ నెటిజన్ అంటే.. అవునూ నా వెనక ఎవరు ఉన్నారో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అంటూ రిప్లై ఇచ్చింది అనసూయ. ఇప్పుడు బ్రహ్మాజీ చేసిన ట్వీట్ కు అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…