Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన స్వయంకృషితో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హోదాను సంపాదించుకున్నారు. 150 చిత్రాలకు పైగా నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించారు మెగాస్టార్ చిరంజీవి. నటనలో ఎంత కష్టమైన పనిని కూడా అవలీలగా చేస్తూ ఎన్నో సినిమాలలో రియల్ స్టంట్స్ చేసి ప్రేక్షకులను అలరించారు. 66 ఏళ్ల వయసులో కూడా ఇప్పటి తరం హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను అందుకుంటున్నారు.
1978వ సంవత్సరంలో పునాదిరాళ్లు చిత్రంతో తన కెరీర్ ను ప్రారంభించి ఎన్నో ఘన విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. సుప్రీం హీరో, టాప్ హీరో, మెగాస్టార్ అంటూ ఎన్నో బిరుదులు ఆయన సొంతం చేసుకున్నారు. అంత గొప్పగా ఉండేది చిరంజీవి నటన. అప్పట్లో చిరంజీవి చిత్రాలలో ఎలాంటి కష్టమైన స్టంట్ చేయడానికి కూడా వెనుకాడేవారు కాదు. ఇప్పుడు వయస్సు రీత్యా స్టంట్స్ విషయంలో రిస్క్ తీసుకోవడం లేదు. అయితే గత 30 సంవత్సరాలుగా చిరంజీవికి ఒక వ్యక్తి డూప్ గా నటిస్తున్నారు.
చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ రియల్ రిస్కీ ఫైట్లతో అలరించే హీరోలు అప్పుడప్పుడూ డూప్ లతో కూడా కొన్ని సన్నివేశాలు చేయవలసిన సందర్భాలు ఏర్పడతాయి. కొన్ని రిస్క్ స్టంట్స్ చేసే టైంలో హీరోలకు ఏదైనా ప్రమాదం జరుగుతుందనే భయం కారణంతో ఆ టైంలో డూప్ లతో సన్నివేశాలు చిత్రీకరిస్తారు దర్శకనిర్మాతలు. అంతటి రిస్క్ సన్నివేశాలు చేసినా కూడా అప్పటి రోజుల్లో డూప్ ల గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలిసేది కాదు.
కానీ ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చిత్ర పరిశ్రమకు సంబంధించి ప్రతి విషయాలు క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. అంతేకాకుండా హీరోలకు నటించే డూప్ ల గురించి కూడా తెలుస్తోంది. ఇక ఇలా హీరోలకు డూప్ లుగా వ్యవహరించే వారిని కొన్ని చానెల్స్ లైవ్ లోకి తీసుకువస్తుండటంతో వారికి కూడా గుర్తింపు వస్తోంది.
అయితే ఇటీవలే ఒక షో లో చిరంజీవికి గత 30 ఏళ్లుగా డూప్ గా చేస్తున్న వ్యక్తి ఎవరు అనే విషయాలు బయటకు వచ్చాయి. ఈటీవీ లో శ్రీదేవి డ్రామా కంపెనీ షో నిర్వాహకులు కొన్ని ప్రాంతాలకు వెళ్లి అక్కడ టాలెంట్ ఉన్న వ్యక్తులను బయటకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్లగా ఆ షోలోకి చిరంజీవికి డూప్ గా వ్యవహరించే వ్యక్తి వెలుగులోకి రావడం జరిగింది. అతని పేరు ప్రేమ్ కుమార్. ఈయన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మార్టూరుకి చెందినవాడు. ప్రేమ్ కుమార్ చిరంజీవికి 30 ఏళ్ళ నుంచి డూప్ గా పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…