రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్ లేకుండానే రైల్లో ఎక్కే పరిస్థితులు ఎదురవుతుంటాయి. అటువంటి సమయంలో టీటీఈ (టికెట్ ఎగ్జామినర్) కనిపించగానే చాలామందికి భయం మొదలవుతుంది. ఎంత ఫైన్ వేస్తారు?, రైలు నుంచి దింపేస్తారా?, దురుసుగా ప్రవర్తిస్తారా? వంటి ఆందోళనలు కలుగుతాయి. కానీ రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణికులకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. టీటీఈ తనకు నచ్చినట్లు ప్రవర్తించడానికి అవకాశం లేదు. మీరు మీ హక్కులు తెలుసుకుంటే, ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ధైర్యంగా వ్యవహరించవచ్చు.
టికెట్ లేకపోయినా, లేదా తప్పు టికెట్ ఉన్నా, టీటీఈ మిమ్మల్ని నేరస్థుడిలా చూడకూడదు. రైల్వే నిబంధనల ప్రకారం, నిర్ణీత ఛార్జీతో పాటు పెనాల్టీ వసూలు చేసి సరైన టికెట్ జారీ చేయాలి. అందుకు సంబంధించిన రసీదు ఇవ్వడం తప్పనిసరి. ఇష్టారాజ్యంగా డబ్బులు అడగడం, రసీదు ఇవ్వకుండా డబ్బులు తీసుకోవడం పూర్తిగా నిషేధం. అలాగే ప్రయాణికులతో దురుసుగా మాట్లాడడం, బెదిరించడం, అవమానించడం టీటీఈకి అనుమతి లేదు. నిబంధనలను వివరించి చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడమే అతని బాధ్యత.
వెయిటింగ్ లిస్ట్ టికెట్తో స్లీపర్ లేదా ఏసీ బోగీలో కూర్చుంటే, సీట్లు లేని పక్షంలో జనరల్ బోగీకి వెళ్లమని సూచించవచ్చు. కానీ నిబంధనల ప్రకారం అవసరం లేకుండా రైలు నుంచి వెంటనే దింపేయడం సాధ్యం కాదు. మహిళలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారి విషయంలో టీటీఈ మరింత సంయమనంతో, మానవీయంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
పెనాల్టీ విధించే ముందు, ఏ నిబంధన ప్రకారం ఎంత మొత్తం వసూలు చేస్తున్నారో టీటీఈ స్పష్టంగా చెప్పాలి. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకునే హక్కు అతనికి లేదు. అన్యాయం జరుగుతోందని అనిపిస్తే, అదనంగా డబ్బులు అడిగితే, లేదా బెదిరిస్తే మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. రైల్వే శాఖ ప్రయాణికుల కోసం సులభమైన ఫిర్యాదు వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ముఖ్య గమనిక: రైలులో టికెట్ లేకుండా ప్రయాణించడం నేరం, అత్యవసర సమయాల్లో మాత్రమే ఈ నియమాలను పాటించాలి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…