Bimbisara : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం బింబిసార. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. డైరెక్టర్ వశిష్ట తెరకెక్కించిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా బింబిసార నిలిచింది. కళ్యాణ్ రామ్ సహజ నటనకు.. డైరెక్టర్ వశిష్ట స్క్రీన్ ప్లే ప్రశంసలు కురిపించారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. వరుస ఫ్లాప్స్ తో కేరీర్ ను నెట్టుకొస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ బింబిసారతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
తొలిసారిగా చక్రవర్తి పాత్రలో నటించిన కళ్యాణ్ రామ్ అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగింది. అయితే తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యింది బింబిసార. ఓటీటీ రిలీజ్ కు ముహూర్తంగా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఇప్పటికే డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం జీ5 (Zee5)లో అక్టోబర్ 7 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
దీంతో నందమూరి అభిమానులు, ఓటీటీ ఆడియెన్స్ ఖుషీ అవుతున్నారు. రూ.40 కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా రూ.65 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మొదటి భాగం విజయవంతం అవడంతో రెండో భాగాన్ని మరింత గ్రాండ్ గా నిర్మించనున్నారు. వచ్చే ఏడాదే బింబిసార 2 ను విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే బింబిసార 2లోనైనా.. బింబిసారా 3లోనైనా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను దింపుతానని ఇప్పటికే కళ్యాణ్ రామ్ అనౌన్స్ చేయడంతో వచ్చే సీక్వెల్స్ పై భారీ అంచనాలున్నాయి. నందమూరి ఫ్యామిలీ మల్టీస్టారర్ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…