Bigg Boss : టీవీ షోల్లో తిరుగులేని షోగా వెలుగొందుతుంది బిగ్ బాస్. ఇప్పటి వరకు బిగ్ బాస్ 5 సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే గత సీజన్లలో బిగ్ బాస్ షో టాప్ రేటింగ్ తో కొనసాగింది. ఈ సీజన్ 6 మాత్రం పరమ బోరింగ్ గా తయారయ్యింది. కింగ్ నాగార్జున హోస్టింగ్ కూడా అంతగా ఆకట్టుకోవడం లేదు. అలాగే ఈ సీజన్ పై ట్రోలింగ్స్ కూడా ఎక్కువయ్యాయి. ఇక టీఆర్పీ పెంచాలని ఫిక్స్ అవడంతో నాగార్జున కూడా హౌస్ మేట్స్ మధ్య గొడవలు పెడుతూ రెచ్చగొడుతున్నాడు. కానీ ఈసారి నాగార్జున ఏం చేసినా.. ఎంతగా ప్రయత్నించినా.. పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు. ఈ క్రమంలోనే వారికి ఉన్న ఒక్కొక్క అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు బిగ్ బాస్ టీమ్.
దీంతో అతి ముఖ్యమైన వైల్డ్ కార్డ్ ను ప్రయోగించబోతున్నారట. ఫేమస్ బుల్లితెర స్టార్స్ ను రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారట బిగ్ బాస్ టీమ్. దీంతో టీఆర్పీ ఓ రేంజ్ లో పెరుగుతుందని అంచనా వేస్తున్నారట. ఇక బిగ్ బాస్ సీజన్ 6 లోకి వైల్డ్ కార్డుతో ఎంటర్ అవ్వబోతుంది ఎవరో కాదు జబర్దస్త్ స్టార్ కమెడియన్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న సుడిగాలి సుధీర్ ను రంగంలోకి దింపబోతున్నారట. దానికోసం అతనికి భారీగా పారితోషికం కూడా ఫిక్స్ చేశారట టీమ్. ఒకవేళ ఇదే నిజమైతే బిగ్ బాస్ లో వార్ వన్ సైడ్ అవుతుంది అంటున్నారు బుల్లితెర ప్రేక్షకులు. అలాగే బిగ్ బాస్ లోకి తీసుకోవాలి అని ఆగిపోయిన స్టార్ కంటెస్టెంట్స్ పై కూడా బిగ్ బాస్ మేకర్స్ కన్నేసినట్టు తెలుస్తోంది.
అందులో ఒకప్పటి స్టార్ యాంకర్ ఉదయభాను కూడా ఉందట. ఆమె రెమ్యూనరేషన్ ఎక్కువగా అడగటంతో బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోలేదని తెలుస్తోంది. ఇక ఇప్పుడు రేటింగ్ పెంచడం కోసం ఆమెను తీసుకోవాలని చూస్తున్నారట. ఇక ఈ ఇద్దరితోపాటు మరో జబర్థస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆదిని కూడా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోవాలని చూస్తున్నారట. ఆది హౌస్ లో ఉంటే.. షో కచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతుందనేది అందరికీ తెలిసిందే. ఈ ముగ్గురిలో ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినా గేమ్ స్ట్రాటజీస్ మారిపోతాయి. టీఆర్పీ రేటింగ్ తప్పకుండా పెరుగుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ లోకి ఎవరు ఎంట్రీ ఇస్తారో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…