Bigg Boss : టీవీ షోల్లో తిరుగులేని షోగా వెలుగొందుతుంది బిగ్ బాస్. ఇప్పటి వరకు బిగ్ బాస్ 5 సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే గత సీజన్లలో బిగ్ బాస్ షో టాప్ రేటింగ్ తో కొనసాగింది. ఈ సీజన్ 6 మాత్రం పరమ బోరింగ్ గా తయారయ్యింది. కింగ్ నాగార్జున హోస్టింగ్ కూడా అంతగా ఆకట్టుకోవడం లేదు. అలాగే ఈ సీజన్ పై ట్రోలింగ్స్ కూడా ఎక్కువయ్యాయి. ఇక టీఆర్పీ పెంచాలని ఫిక్స్ అవడంతో నాగార్జున కూడా హౌస్ మేట్స్ మధ్య గొడవలు పెడుతూ రెచ్చగొడుతున్నాడు. కానీ ఈసారి నాగార్జున ఏం చేసినా.. ఎంతగా ప్రయత్నించినా.. పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు. ఈ క్రమంలోనే వారికి ఉన్న ఒక్కొక్క అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు బిగ్ బాస్ టీమ్.
దీంతో అతి ముఖ్యమైన వైల్డ్ కార్డ్ ను ప్రయోగించబోతున్నారట. ఫేమస్ బుల్లితెర స్టార్స్ ను రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారట బిగ్ బాస్ టీమ్. దీంతో టీఆర్పీ ఓ రేంజ్ లో పెరుగుతుందని అంచనా వేస్తున్నారట. ఇక బిగ్ బాస్ సీజన్ 6 లోకి వైల్డ్ కార్డుతో ఎంటర్ అవ్వబోతుంది ఎవరో కాదు జబర్దస్త్ స్టార్ కమెడియన్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న సుడిగాలి సుధీర్ ను రంగంలోకి దింపబోతున్నారట. దానికోసం అతనికి భారీగా పారితోషికం కూడా ఫిక్స్ చేశారట టీమ్. ఒకవేళ ఇదే నిజమైతే బిగ్ బాస్ లో వార్ వన్ సైడ్ అవుతుంది అంటున్నారు బుల్లితెర ప్రేక్షకులు. అలాగే బిగ్ బాస్ లోకి తీసుకోవాలి అని ఆగిపోయిన స్టార్ కంటెస్టెంట్స్ పై కూడా బిగ్ బాస్ మేకర్స్ కన్నేసినట్టు తెలుస్తోంది.
అందులో ఒకప్పటి స్టార్ యాంకర్ ఉదయభాను కూడా ఉందట. ఆమె రెమ్యూనరేషన్ ఎక్కువగా అడగటంతో బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోలేదని తెలుస్తోంది. ఇక ఇప్పుడు రేటింగ్ పెంచడం కోసం ఆమెను తీసుకోవాలని చూస్తున్నారట. ఇక ఈ ఇద్దరితోపాటు మరో జబర్థస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆదిని కూడా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోవాలని చూస్తున్నారట. ఆది హౌస్ లో ఉంటే.. షో కచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతుందనేది అందరికీ తెలిసిందే. ఈ ముగ్గురిలో ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినా గేమ్ స్ట్రాటజీస్ మారిపోతాయి. టీఆర్పీ రేటింగ్ తప్పకుండా పెరుగుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ లోకి ఎవరు ఎంట్రీ ఇస్తారో చూడాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…