Bigg Boss : తెలుగులో బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన టీవీ షో బిగ్ బాస్. తెలుగు తెరపై ఈ షో సాధించిన టీఆర్పీ రేటింగ్స్ ను వేరే ఏ ఇతర షో కూడా సాధించలేకపోయింది. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ షోకి అభిమానులుగా మారిపోయారు. కానీ ఇంతగా ప్రాచుర్యం పొందిన ఈ షో లో గెలుపొందిన వారికి మాత్రం ఆ తరువాత కెరీర్ లో కలసిరావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. షోలో గెలుపొంది బయటకు రాగానే హడావిడి చేయడం, ఎడాపెడా సినిమాలు, టీవీ షోలు చేయబోతున్నట్టుగా ప్రకటించడం ఆ తరువాత కనుమరుగైపోవడం అలవాటుగా మారిపోయింది.
అయితే ఇలా జరగడం అనేది బిగ్ బాస్ సీజన్ 2 లో గెలుపొందిన కౌశల్ తో మొదలైంది. ఈయన ఎన్నో వివాదాలు, హంగూ, ఆర్భాటాల మధ్య బిగ్ బాస్ లో గెలుపొంది రాగానే అనేక సినిమాలు చేయనున్నట్టు వెల్లడించాడు. వాటిలో చాలా వరకు విడుదల కూడా కాలేదు, కొన్ని విడుదల అయినప్పటికీ ప్రేక్షకుల దృష్టికి రాకుండానే పోయాయి. దాదాపు బిగ్ బాస్ విన్నర్స్ అందరూ ఇదే పరిస్థితిని చవిచూశారు.
ఆ తరువాత సీజన్ 4 లో విన్నర్ గా నిలిచిన అభిజీత్, సీజన్ 5 లో విజేత అయిన వీజే సన్నీల విషయంలో కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఇక వీజే సన్నీ కూడా బిగ్ బాస్ లో గెలుపొంది బయటకు రాగానే కొన్ని ప్రాజెక్టులు చేశాడు. కానీ వాటిలో ఏవీ విడుదలకు నోచుకోలేదు. ఇంకా ఇదే సీజన్ 5 లో రన్నరప్ గా నిలిచిన యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ కూడా చాలా కాలం ఎదురు చూపుల తరువాత ఆహా ఓటీటీ ద్వారా ఏజెంట్ ఆనంద్ సంతోష్ అనే వెబ్ సిరీస్ తో పలకరించాడు. కానీ అతనికి అది ఆశించినంతగా ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే దీప్తి సునయనతో తన బ్రేకప్ టాపిక్ మాత్రం ఈ వెబ్ సిరీస్ కంటే బాగా పాపులర్ అయ్యింది.
అదే విధంగా బిగ్ బాస్ లో వివిధ సీజన్లలో పాల్గొన్న వారు కూడా చాలా మంది ఆ తరువాత తెరమరుగైపోవడం కూడా జరుగుతూనే ఉంది. అయితే వీరంతా బిగ్ బాస్ ద్వారా వచ్చిన అభిమానులను, పాపులారిటీని తరువాత నిలబెట్టుకోవడంలో విఫలం అవుతున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…