Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో ఏడోవారం ప్రియ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందేమోనని అందరూ భావించారు. కానీ సస్పెన్స్ నడుమ ప్రియ ఎలిమినేట్ అయింది. గత వారం నామినేషన్స్లో ప్రియ, అనీ మాస్టర్, లోబో, జెస్సీ, రవి, శ్రీరామ్, కాజల్, సిరి ఉండగా.. ప్రియ ఎలిమినేట్ అయింది. అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఇంటి నుంచి ఎలిమినేట్ అయిందని కార్యక్రమ వ్యాఖ్యాత, నటుడు నాగార్జున తెలిపారు.
కెప్టెన్సీ కోసం జరిగిన టాస్క్ లో కంటెస్టెంట్ ప్రియ, వీజే సన్నీ మధ్య వాగ్వాదం నడిచింది. కోడి నుండి గుడ్లు సేకరించడం, వాటిని దాచుకోవడం రసాభాసకు దారితీసింది. ఈ గేమ్ లో ప్రియ బుట్టను చించి వేస్తుంటే, సన్నీ అడ్డుకున్నాడు. ఆమెను పక్కకు తోసేసి బుట్ట తీసుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ప్రియ చెంప పగులుద్ది అన్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయాన్ని నాగార్జున కూడా ప్రస్తావనకు తెచ్చారు.
తనను గట్టిగా తోసేశాడని, అందుకే కోపంతో అలా అన్నాను.. అంటూ ప్రియ వివరణ ఇచ్చింది. అయితే ప్రియ ప్రవర్తనే ఆమె కొంపముంచింది. ఆ గొడవలో ప్రియ కాస్త శృతి మించినట్టు కనిపించడంతో ఆమెను ఎలిమినేట్ చేశారని అంటున్నారు. టాస్క్లలో ప్రియ.. సన్నీని టార్గెట్ చేయడం, నువ్వు మగాడివే కాదు అని అనడం, ఏం చేసుకుంటావో చేసుకో నీలాంటి వాళ్లను చాలా మందిని చూశాను.. అంటూ దారుణంగా రెచ్చగొట్టడం ప్రియకు నెగెటివ్గా మారాయని అంటున్నారు. ముందు అనీ మాస్టర్ డేంజర్ జోన్లో ఉండగా, ఆ తర్వాత ప్రియ ప్రవర్తించిన తీరు ఆమెను హౌస్ నుంచి బయటకు వచ్చేలా చేసింది.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…