Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో మంగళవారం ఎపిసోడ్ నాటకీయ పరిణామాల మధ్య సాగింది. ముఖ్యంగా జస్వంత్ని అడ్డుపెట్టుకొని బిగ్ బాస్ అందరిని ఫూల్స్ని చేశాడు. అనారోగ్యంతో బాధపడుతున్న జస్వంత్ని కన్ఫెషన్ రూంకి పిలిచిన బిగ్ బాస్.. ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. ఇప్పుడు ఎలా ఉందని అడగ్గా.. ఫర్లేదు బాగానే ఉంది కానీ.. పడుకుంటే భూమి గుండ్రంగా తిరిగినట్టుగా అనిపిస్తుందని చెప్పాడు జెస్సీ.
ఇప్పుడు మీకు మెడికల్ ఇన్వెస్టిగేషన్ చాలా అవసరం.. అందుకోసం మీరు ఇంటి నుంచి బయటకు రావాల్సి ఉంటుంది అని చెప్పాడు బిగ్ బాస్. దీంతో కన్ఫెషన్ రూం నుండి బయటకు వచ్చిన జస్వంత్ .. అందరికీ తాను వెళుతున్నట్టు చెప్పాడు. జెస్సీ వెళ్తూ వెళ్తూ చాలా చాలా ఎమోషనల్గా మాట్లాడాడు. నా హెల్త్ బాగాలేనందుకు చాలామంది పేంపరింగ్ చేశారు. మానస్, సన్నీ, కాజల్, పింకీ, ఆనీ అందరూ. షణ్ముఖ్, సిరి పేర్లను చెప్పాలని అనుకోవడం లేదు. ఎందుకంటే మీరు నా హార్ట్కి దగ్గరైన వాళ్లు. మీ ఇద్దరితో జర్నీ ఈ రోజు వరకే ఉంది.. ఇక్కడివరకే నేను బిగ్ బాస్ చూస్తా. నేను సాధించలేకపోతున్నా.. అది మీరు చేసి చూపించాలి’ అంటూ భావోద్వేగానికి గురయ్యాడు జెస్సీ.
జెస్సీ వెళ్లిపోయినందుకు షణ్ముఖ్, సిరి తెగ బాధపడిపోయారు. ప్రేక్షకులు కూడా ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. కానీ అందరినీ పిచ్చోళ్లను చేసి జెస్సీని తీసుకెళ్లి సీక్రెట్ రూంలో ఉంచాడు బిగ్ బాస్. సీక్రెట్ రూంలోకి వచ్చిన జెస్సీ.. ‘నాకు మంచి హెల్త్ చెకప్ చేయించారు.. నాకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు.. హెల్త్ కండిషన్ ఒకే.. నేను ఇంకా గేమ్లోనే ఉన్నాను.. సీక్రెట్ రూంలో పెట్టినందుకు చాలా థాంక్స్ బిగ్ బాస్’ అని చెప్పాడు జెస్సీ.
మిమ్మల్ని వైద్య పరీక్షల కోసం బయటకు తీసుకుని వెళ్లాం.. డాక్టర్లు పరీక్షించి ఆల్ క్లియర్ అని చెప్పారు. కానీ.. ఇంట్లోకి వెళ్లడానికి ముందు క్వారంటైన్ చేయాల్సి ఉంటుంది.. బిగ్ బాస్ ఆదేశాలు వచ్చేవరకూ మీరు క్వారంటైన్లోనే ఉండాలని చెప్పారు బిగ్ బాస్. మరి జెస్సీ మళ్లీ హౌస్లోకి ఎప్పుడు వెళ్తాడో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…