Bigg Boss 5 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతోంది. ప్రస్తుతం హౌజ్లో 7 మంది సభ్యులు మాత్రమే ఉండగా, ఇందులో ఎవరు విన్ అవుతారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే ప్రస్తుతం హౌజ్లో ఉన్నవారికి సపోర్ట్ తోపాటు విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా ఓ నెటిజన్ షణ్ముఖ్పై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. ‘షణ్నును ఎక్కడో చూసినట్లుంది.. పొద్దున్నే పాల ప్యాకెట్లు ఎత్తుకుపోయేది, కాగితాలు ఏరుకునేది.. మీరే కదా.. గుర్తుపట్టాను.
మీ ముఖం అయితే 5 పైసలు ఉంటది. కాగితాలు ఏరుకునేటోడు ఓ రాయి పట్టుకుని కుక్కల వెనకాల తిరుగుతుంటడు చూడు.. వాడు సేమ్ నీలాగే ఉంటడు షణ్ను.. అంటూ విపరీత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై గత సీజన్ రన్నరప్ అఖిల్ సార్థక్ ఘాటుగా స్పందించాడు. మీరు చేస్తోంది చాలా పెద్ద తప్పు ! ఒకరు మీకు నచ్చలేదంటే వాళ్లను మీరు బాడీ షేమింగ్ చేయాల్సిన అవసరం లేదు. మరీ అంతలా ద్వేషించకండి ! ఇది ఒక గేమ్ షో మాత్రమే అని అన్నాడు.
ఇది చూసి ఎంజాయ్ చేయండంతే ! మరీ ఇంత నెగెటివిటీ వద్దు. నోటికొచ్చినట్లు మాట్లాడటం చాలా ఈజీ. నువ్వు ఆ గేమ్ షోలో ఉండి ఉంటే నిన్ను ఎవరైనా ఇలా ట్రోల్ చేస్తే నీకు తెలుస్తుంది ఆ బాధేంటో ! వయసు పెరగడం కాదు, బుద్ధి కూడా పెరగాలి అని అన్నాడు.
‘మీకు నచ్చిన కంటెస్టెంట్ను గెలిపించడం కోసం అవతలి వారిని కించపరచడం చాలా తప్పు. రేపు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతమో తెలీదు, ఎందుకు బ్రో ఇంతగా నెగెటివిటీ. వేధించడం మానేసి పాజిటివిటీని వ్యాప్తి చేయండి. గేమ్ షోను గేమ్ షోలా మాత్రమే చూడండి’ అని చెప్పుకొచ్చాడు. ఈ పోస్ట్పై షణ్ను ప్రేయసి దీప్తి సునయన.. అఖిల్కి థ్యాంక్స్ చెప్పింది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…