మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఓటమిని ప్రకాష్ రాజ్ అంత ఈజీగా మరిచిపోయేలా కనిపించడం లేదు. ఆయన మొన్నీ మధ్యే ఎన్నికల రోజుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కావాలని కోరారు. అయితే ఎన్నికలతోనే తన పని అయిపోయిందని, సీసీటీవీ ఫుటేజ్ కావాలంటే కోర్టు ద్వారా తెప్పించుకోవాలని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ బదులిచ్చారు. దీంతో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ వరకు వెళ్లిన ప్రకాష్ రాజ్ ఉసూరుమంటూ వెనక్కి వచ్చేశారు.
అయితే తాజాగా మా ఎన్నికల వివాదం ఊహించని మలుపు తిరిగింది. ఎన్నికల రోజు కేంద్రంలో రౌడీ షీటర్ ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ స్వయంగా వెల్లడించారు. ఆ రోజు రౌడీ షీటర్ కేంద్రంలో ఉన్నాడని చెబితే.. ఎన్నికల అధికారి ఖండించారు, ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా స్పష్టంగా బయట పడింది.. అని ప్రకాష్ రాజ్ అన్నారు.
కాగా సదరు రౌడీ షీటర్ ను నూకల సాంబశివరావుగా గుర్తించారు. అతనిపై జగ్గయ్యపేట పీఎస్లో రౌడీ షీటర్గా కేసులు ఉన్నాయి. గతంలో ఓ హత్య కేసులోనూ అతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతను బెదిరింపులకు పాల్పడడం, సెటిల్మెంట్లు చేయడం వంటివి చేస్తుంటాడు. గతంలో నోట్ల రద్దు సయంలోనూ కోట్ల రూపాయలను తరలిస్తుండగా.. ఓ ఎస్సైని కారుతో ఢీకొట్టాలని ప్రయత్నం చేశాడు.
అయితే ఎన్నికల రోజున సదరు రౌడీ షీటర్ కేంద్రంలో ఏం చేస్తున్నాడని ? అతన్ని కేంద్రంలోకి ఎందుకు అనుమతించారని.. ప్రకాష్ రాజ్ ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ తెలియాల్సి ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…