Bhimla Nayak : భారతీయ చిత్ర పరిశ్రమ ప్రస్తుతం చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. నిన్న మొన్నటి వరకు అంతా బాగానే ఉంది, ఇక సినిమాలను థియేటర్లలో రన్ చేసుకోవచ్చని ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆశపడ్డాయి. కానీ వారి ఆశలు అడియాశలే అవుతున్నాయి. కరోనా కారణంగా అనేక సినిమాలను వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. ఇక కొందరు హీరోల సినిమాలు అయితే నేరుగా ఓటీటీలోనే విడుదలవుతున్నాయి.
సంక్రాంతి బరిలో నిలిచిన భీమ్లా నాయక్ చిత్రాన్ని వాయిదా వేసే ప్రసక్తే లేదని గతంలో చిత్ర యూనిట్ తెలిపింది. అయితే అదే సమయంలో ఆర్ఆర్ఆర్ మూవీ ఉండడంతో వారి కోరిక మేరకు భీమ్లా నాయక్ను వాయిదా వేశారు. దీంతో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే అప్పటి వరకు పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని తెలుస్తోంది. కనుక చిత్రాన్ని విడుదల చేసి నష్టాలు కొనితెచ్చుకోవడం కంటే.. వాయిదా వేయడమే మేలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకనే భీమ్లా నాయక్ విడుదలను మళ్లీ వాయిదా వేయాలని చూస్తున్నట్లు సమాచారం. దీనిపై నేడో, రేపో అధికారిక ప్రకటన చేస్తారని కూడా సమాచారం అందుతోంది. ఇక ఈ మూవీని ఏప్రిల్ 1వ తేదీన విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భీమ్లా నాయక్ చిత్రంలో పవన్ కల్యాణ్, రానా, నిత్య మీనన్ కీలకపాత్రల్లో నటించారు. సాగర చంద్ర ఈ మూవీకి దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్కు సన్నిహితుడు కనుక ఈ సినిమాను దగ్గరుండి చూసుకున్నారు. దీంతో వారి కాంబినేషన్లో మళ్లీ ఈ మూవీ హిట్ అవుతుందని భావిస్తున్నారు. భీమ్లా నాయక్ను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మించారు. మళయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్కు రీమేక్గా దీన్ని తెరకెక్కించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…