Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్.. ఇందులో రానా కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ రాస్తున్నారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, పాటలు సినిమాపై అంచనాలను మరితంగా పెంచేశాయి.
భీమ్లా నాయక్ అప్ డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఇక ఈ మూవీ నుంచి తాజాగా 4వ పాటను విడుదల చేశారు.
భీమ్లానాయక్ నుంచి అడవి తల్లి అనే పాటను నిజానికి డిసెంబరు 1వ తేదీనే విడుదల చేయాలనుకున్నారు. కానీ సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతికి సంతాపంగా ఆ పాట విడుదలను వాయిదా వేశారు. ఈక్రమంలోనే ఆ పాటను డిసెంబరు 4న (శనివారం) ఉదయం 10.08 గంటలకు విడుదల చేశారు. ఇక ఈ పాట తాజాగా విడుదల కాగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అడవితల్లి మాట అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు.
మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు తెలుగు రీమేక్ గా భీమ్లా నాయక్ ను తెరకెక్కిస్తున్నారు. మలయాళ సినిమాలో పోలీసు ఆఫీసర్ గా బిజూ మేనన్ నటించగా.. ఆ పాత్రను పవన్ కల్యాణ్ పోషిస్తున్నారు. మరో కీలక పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించగా.. ఆ పాత్రలో రానా దగ్గుబాటి నటించారు.
ఈ సినిమాలో పవన్ సరసన నిత్యామీనన్, రానా పక్కన సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఇక రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను, కాదంబరి కిరణ్ లు ఈ సినిమాలో పలు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…